News March 9, 2025
శ్రీకాకుళం: ప్రభుత్వ ఆసుపత్రుల్లో పోస్టుల భర్తీ నోటిఫికేషన్

శ్రీకాకుళం జిల్లాలోని సెకండరీ హెల్త్ ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైందని డీసీహెచ్ కళ్యాణ బాబు ఆదివారం తెలిపారు. అర్హులైన అభ్యర్థులు మార్చి 10-15 తేదీల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. థియేటర్ అసిస్టెంట్, ఆడియోమెట్రీషియన్, ఎలక్ట్రీషియన్, జనరల్ డ్యూటీ అటెండర్, ప్రింటర్ పోస్టులకు ఖాళీలకు అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News March 10, 2025
SKLM: పరిశ్రమల స్థాపనతోనే ఆర్థిక ప్రగతి-కలెక్టర్

పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని అనుమతులను సత్వరమే మంజూరు చేసి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశం జూమ్ ద్వారా సోమవారం జరిగింది. ఈ సమావేశంలో పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై కలెక్టర్ జిల్లాలోని ఆయా ఉన్నతాధికారులతో కలిసి చర్చించారు.
News March 10, 2025
SKLM: ఎస్పీ గ్రీవెన్స్లో 52 వినతలు స్వీకరణ

ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని తన కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు ఫిర్యాదులు చేశారు. తన దృష్టికి వచ్చిన ఫిర్యాదులపై సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకున్నారు. మొత్తం 52 వినతిపత్రాలు స్వీకరించామన్నారు.
News March 10, 2025
శ్రీకాకుళం: ఇంటర్ పరీక్షకు 351 మంది గైర్హాజరు

శ్రీకాకుళం జిల్లాలో సోమవారం జరిగిన ఇంటర్ పరీక్షకు 351 మంది గైర్హాజరు అయినట్లు జిల్లా ఆర్ఐఓ పీ.దుర్గారావు తెలిపారు. జిల్లాలో జనరల్, ఒకేషనల్ కలిపి 17,523 మందికి గాను 17,171 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు తెలిపారు. జిల్లాలో ఎక్కడా మాల్ ప్రాక్టీస్ నమోదు కాలేదని తెలిపారు. కాగా సోమవారం జరిగిన ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు ఆర్ఐఓ పేర్కొన్నారు.