News March 9, 2025

యాదాద్రి: ఎమ్మెల్సీగా శంకర్ నాయక్ ఫైనల్..!

image

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా నల్గొండ డీసీసీ అధ్యక్షుడు కెతావత్ శంకర్ నాయక్ పేరు ఖరారు చేస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్టీ కోటాలో ఆయన పేరును ఫైనల్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా, శంకర్ నాయక్‌కు మిర్యాలగూడ, హుజూర్‌నగర్, నాగార్జున సాగర్ గిరిజన తండాల్లో పట్టుంది. జిల్లా మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి, ఇతర ఎమ్మెల్యేల సిఫార్సు మేరకు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

Similar News

News November 18, 2025

టుడే టాప్ స్టోరీస్

image

* సౌదీలో ఘోర బస్సు ప్రమాదం.. 45మంది హైదరాబాదీలు సజీవదహనం
* ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం ఉత్తర్వులు
* కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి DECలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని TG క్యాబినెట్ నిర్ణయం
* TG ఫిరాయింపు MLAల కేసులో స్పీకర్‌పై SC ఆగ్రహం
* బంగ్లా మాజీ PM హసీనాకు మరణశిక్ష

News November 18, 2025

టుడే టాప్ స్టోరీస్

image

* సౌదీలో ఘోర బస్సు ప్రమాదం.. 45మంది హైదరాబాదీలు సజీవదహనం
* ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం ఉత్తర్వులు
* కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి DECలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని TG క్యాబినెట్ నిర్ణయం
* TG ఫిరాయింపు MLAల కేసులో స్పీకర్‌పై SC ఆగ్రహం
* బంగ్లా మాజీ PM హసీనాకు మరణశిక్ష

News November 18, 2025

సామాన్య యువకుడు… ₹9,960 CRకు అధిపతి

image

MPలోని మారుమూల పల్లెలో పుట్టి, మాతృభాషలో చదువుకున్న ఆ యువకుడు ₹9,960 CRకు అధిపతి అయ్యాడు. ‘Groww’ CEO లలిత్ కేష్రే బిలియనీర్ల జాబితాలో చేరాడు. IIT బాంబేలో చదివిన ఆయన ముగ్గురితో కలిసి 2016లో గ్రోను నెలకొల్పారు. వృద్ధి సాధించిన కంపెనీ FY2025లో ₹4,056Cr ఆదాయంతో ₹1,824Cr లాభాన్ని ఆర్జించింది. తాజాగా మార్కెట్లో లిస్ట్ అయిన దీని క్యాపిటలైజేషన్ ₹1.05L Crకు చేరింది. ఇందులో 55.91Cr షేర్స్ కేష్రేవే.