News March 9, 2025
సూర్యాపేట: ఆ 8 మంది సజీవ సమాధి..?

నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట SLBC టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులు సజీవ సమాధి అయినట్లు తెలుస్తోంది. వారి మృతదేహాలను వెలికి తీసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఓ వ్యక్తి మృతదేహాన్ని వెలికి తీసినప్పటికీ అతనికి సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించలేదు. ఆ మృతదేహం పక్కనే మరో రెండు మృతదేహాలు ఉన్నప్పటికీ వాటిని వెలికి తీసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
Similar News
News March 10, 2025
వేల్పూర్: బంగారంతో ICC ఛాంపియన్స్ ట్రోఫీ

నిజామాబాద్ వేల్పూర్ మండలం పడగల్ గ్రామానికి చెందిన స్వర్ణకారుడు మంచిర్యాల నవీన్ కుమార్ 0.080 మిల్లీ గ్రాముల బంగారంతో ICC ఛాంపియన్స్ ట్రోఫీ నమూనా తయారు చేశారు. ఇండియా జట్టు ఫైనల్ గెలవాలనే ఉద్దేశంతో దీన్ని తయారు చేసినట్లు నవీన్ తెలిపాడు. నవీన్ను గ్రామ ప్రజలు, క్రీడాకారులు, తోటి స్నేహితులు అభినందించారు.
News March 10, 2025
తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశం

తెలంగాణ భవన్లో ఈరోజు ఉదయం 10 గంటలకు బీఆర్ఎస్ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర రాజకీయాలు, BRS కార్యక్రమాలు, బీఆర్ఎస్ ఆవశ్యకతపై వివరణాత్మకంగా మాట్లాడనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పెరేడ్ గ్రౌండ్ సమావేశంలో మహిళా సంఘాలకు, అభివృద్ధి ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని చెప్పిన మాటలకు పూర్తి వివరాలతో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.
News March 10, 2025
KMR: కుమార్తెను చూసేందుకు వెళ్తూ తండ్రి మృతి

కూతురును పుట్టిందన్న సంతోషంలో కామారెడ్డి జిల్లాలోని అత్తగారింటికి వెళ్తున్న వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారం వాసి నరేశ్ (28)కు నెల క్రితం కూతురు పుట్టింది. బీబీపేట మండలం మల్కాపూర్లోని అత్తగారింట్లో ఉన్న భార్య, పాపను తీసుకురావడానికి ఆదివారం బైక్పై వెళ్తున్నాడు. ఆకారం శివారులో ఆటో ఢీకొట్టడంతో స్పాట్లోనే చనిపోయాడు. కేసు నమైదైంది.