News March 9, 2025
ప్రత్తిపాడు: జనసేన ఇన్ఛార్జ్ తమ్మయ్యబాబు సస్పెండ్

ప్రత్తిపాడు జనసేన ఇన్ఛార్జ్ వరుపుల తమ్మయ్యబాబు స్థానిక సీహెచ్సీ వైద్యురాలిపై విరుచుకుపడ్డ విషయం విధితమే. ఒక పక్క పార్టీ కార్యాలయం విచారణకు ఆదేశించింది. ఆదివారం రాత్రి పార్టీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ వేములపాటి అజయ్ తమ్మయ్య బాబును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇది సంచలనంగా మారింది. తప్పు చేసిన వారిని పవన్ వదలరు అనడానికి ఇది నిదర్శనంగా నిలిచింది.
Similar News
News March 21, 2026
మళ్లీ ప్రత్తిపాడు నియోజకవర్గంలోకి టైగర్ ఎంట్రీ..!

పోలవరం జిల్లాలో పెద్దపులి సంచారం గిరిజన ప్రాంత ప్రజలను భయపెడుతున్న విషయం తెలిసిందే. అటవీశాఖ అధికారులు ఎప్పటికప్పుడు పులి కదలికలను గమనిస్తూ సమీప గ్రామ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. శుక్రవారం రాత్రి పెద్దపులి ఏలేశ్వరం మండలంలోని “పరిమితడక” గ్రామ సమీపంలో ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఈ ప్రాంతం కాకినాడ-పోలవరం జిల్లాల బోర్డర్ కావడంతో 2 జిల్లాల అధికారులు పులిపై నిఘా ఉంచారు.
News March 21, 2026
నెల్లూరు: మాఫియాకు చెక్ పెట్టేది ఎప్పుడు.. ఎలా?

ఒక్కసారి జరిగితే తప్పు. అదే పదేపదే జరిగితే నేరం. ప్రస్తుతం నెల్లూరులో జరిగేది ఇదే. రాజకీయ నేతల అండదండలతో రేషన్ బియ్యాన్ని దోచేస్తున్నారు. 2025లో 73 కేసులు నమోదు చేసి 2400 క్వింటాళ్ల బియ్యం పట్టుకున్నారు. 2026లో 14 కేసులు నమోదు చేసి 650.8 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేశారు. 15 నెలల్లోనే రూ. 1.37 కోట్ల ధాన్యం పట్టుబడింది. మాఫియాకు అధికారులు సైతం అండగా ఉంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
News March 21, 2026
ఉదయాన్నే కాఫీ/టీ తాగితే..

కాఫీ, టీ తాగితే మంచిదా? కాదా? అనే అంశంపై విభిన్న ప్రకటనలు వెలువడుతూనే ఉన్నాయి. తాజాగా USకు చెందిన హార్వర్డ్, MIT సైంటిస్టులు ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. ఉదయాన్నే కెఫిన్ ఉన్న కాఫీ/టీని మితంగా తీసుకుంటే డిమెన్షియా(మతిమరుపు) ప్రమాదం 18% తగ్గుతుందని పేర్కొన్నారు. స్పష్టంగా ఆలోచించే సామర్థ్యం మెరుగుపడుతుందన్నారు. 43 ఏళ్లలోపు వయసున్న 1,31,821 మంది డేటాను విశ్లేషించి ఈ విషయాన్ని తెలిపారు.


