News March 10, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

✓ ఇసుక అక్రమ రవాణా.. చర్యలు తీసుకుంటాం: మణుగూరు MRO ✓ రేపు భద్రాద్రి కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం ✓ రేపు పినపాక, కరకగూడెంలో పర్యటించనున్న ఎమ్మెల్యే పాయం ✓ పొదెం వీరయ్య, నాగ సీతారాములకు దక్కని ఎమ్మెల్సీ ✓ భద్రాద్రి: మాదిగలను మంత్రివర్గంలో తీసుకోవాలి: ఎమ్మార్పీఎస్ ✓ కొత్తగూడెం: మొక్కల ప్రేమికుడు విశ్వామిత్రను అభినందించిన హైకోర్టు జడ్జి ✓ పినపాకలో తల్లికి తలకొరివి పెట్టిన కూతుళ్లు.
Similar News
News March 10, 2025
గన్నవరం: వంశీ కస్టడీపై నేడు విచారణ

విజయవాడ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టులో నేడు వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్పై విచారణ జరుగనుంది. పోలీసులు వంశీని 10రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసు దర్యాప్తులో మరిన్ని వివరాలు సేకరించేందుకు కస్టడీ అవసరమని పోలీసులు కోర్టుకు వివరించారు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వంశీ ఏ71గా ఉన్నారు.
News March 10, 2025
NGKL: చికిత్స పొందుతూ మహిళ మృతి

ఈ నెల 7న రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ మహిళ చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతిచెందింది. పోలీసుల వివరాలు.. NGKL మండలం వనపట్లకు చెందిన అనూష(32) బైక్పై వస్తుండగా.. కొల్లాపూర్ క్రాస్ రోడ్డు సమీపంలో వెనుక నుంచి ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్రగాయాలు కాగా.. HYDలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదైంది.
News March 10, 2025
కృష్ణా: 45వేల మందికి ఉద్యోగ అవకాశాలు

మల్లవల్లి పారిశ్రామిక వాడలో 405 పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. దీంతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు భారీగా రానున్నాయి. ప్రత్యక్షంగా 30వేల మందికి, పరోక్షంగా 15వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. మొత్తం 45వేల మందికి ఉద్యోగ అవకాశాలు త్వరలో రానున్నాయి. ఒకప్పుడు పల్లెటూరిగా ఉన్న మల్లవల్లి ఇప్పుడు వేగంగా ఓ పట్టణంగా మారబోతుంది.