News March 10, 2025

TODAY HEADLINES

image

☛ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్
☛ TG: చేనేత కార్మికుల రుణమాఫీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
☛ పద్మశాలీల రుణం తీర్చుకుంటా: సీఎం రేవంత్
☛ SLBC టన్నెల్‌ నుంచి మృతదేహం వెలికితీత
☛ APలో టీడీపీ, TGలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన
☛ సంగీత విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూత
☛ ఆసుపత్రిలో చేరిన ఉప రాష్ట్రపతి ధన్‌ఖడ్

Similar News

News March 10, 2025

అమెరికాతో ట్రేడ్‌వార్: ఆహారమే చైనా ఆయుధం!

image

అమెరికాతో ట్రేడ్‌వార్‌లో చైనా చాకచక్యం ప్రదర్శిస్తోంది. ‘అధిక ప్రభావం – తక్కువ ఖర్చు’ వ్యూహాన్ని అమలు చేస్తోంది. డొనాల్డ్ ట్రంప్‌పై ఆహారాన్ని ఆయుధంగా ప్రయోగిస్తోంది. వ్యవసాయ ఉత్పత్తులపై US అతిగా ఆధారపడ్డ మూడో దేశం చైనా. చేపలు, రొయ్యల వంటి సముద్ర ఆహారం, వెల్లుల్లి, తేనె, పప్పులను దిగుమతి చేసుకుంటుంది. 2024లో ఈ వాణిజ్యం విలువ $3.9B పైమాటే. వీటిపై అధిక సుంకాలతో ఒత్తిడి పెంచాలన్నది జింగ్‌పింగ్ ఆలోచన.

News March 10, 2025

జియో కొత్త ప్లాన్.. రూ.100తో..

image

ఓటీటీ వ్యూయర్ల కోసం రిలయన్స్ జియో కొత్త రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. రూ.100తో జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు 5GB డేటా లభిస్తుంది. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 90 రోజులు ఉంటుంది. హాట్‌స్టార్ ఫోన్ లేదా టీవీ ఏదైనా ఒకదానిలో ఉపయోగించవచ్చు. ఈ ప్లాన్లో ఎలాంటి వాయిస్ కాలింగ్ ఉండదు.

News March 10, 2025

ఆ రైతులకూ రూ.20వేలు: మంత్రి అచ్చెన్న

image

AP: అర్హులైన ప్రతి రైతుకు ‘అన్నదాత సుఖీభవ’ కింద రూ.20 వేలు ఇస్తామని మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో అన్నారు. కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి బ్యాంకుల్లో జమ చేస్తామని వెల్లడించారు. కౌలు రైతులు, వెబ్ ల్యాండ్‌లో నమోదైన వారికీ పథకం వర్తిస్తుందన్నారు. మరో మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ.. రూ.30 వేల కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ తెచ్చామన్నారు. 16 రకాల ఇన్సెంటివ్స్ ఇస్తున్నామని వివరించారు.

error: Content is protected !!