News March 10, 2025

కడప: యథావిధిగా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం

image

ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం సోమవారం యథావిధిగా జరుగుతుందని కడప కలెక్టర్ శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామ, మండల స్థాయిలో పరిష్కారం కానీ సమస్యలను నేరుగా కలెక్టరేట్లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News January 8, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం ధరలు ఇలా..!

image

ప్రొద్దుటూరులో గురువారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
24 క్యారెట్ల బంగారం గ్రాము: రూ.13920
22 క్యారెట్ల గ్రాము ధర: రూ.12806
*వెండి 10 గ్రాములు: : రూ.2,435

News January 8, 2026

గండికోట ఉత్సవాలకు సింగర్ మంగ్లీ, రామ్ మిర్యాల, శివమణి రాక

image

జమ్మలమడుగు మండలంలోని గండికోటలో ఈ నెల 11 నుంచి 13 వరకు గండికోట ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ ఉత్సవాలకు మొదటి రోజు సింగర్ మంగ్లీ, రెండవ రోజు రామ్ మిర్యాల, మూడవరోజు శివమణి ఈ ఉత్సవాలలో అలరించనున్నారు. చివరిసారిగా 2020లో వైభంగా జరిగాయి. దీంతో అధికారులు ఏర్పాట్లకు సన్నద్ధమవుతున్నారు. ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

News January 8, 2026

మరో భారీ ఈవెంట్‌‌కు సిద్ధమవుతున్న జమ్మలమడుగు

image

జమ్మలమడుగు.. ఇక్కడ రాజకీయ రణరంగమే కాదు, రాష్ట్ర, జాతీయ స్థాయి ఈవెంట్లను సైతం చేయగల సత్తా ఉన్న ప్రాంతం అని నిరూపిస్తోంది. ఈనెల 5 నుంచి ప్రారంభమైన 69వ జాతీయ స్థాయి U-14 బాలికల వాలీబాల్ పోటీలను సమర్థవంతంగా జమ్మలమడుగులోని అధికారులు నిర్వహిస్తున్నారు. అదే విధంగా ఈ నెల 11 నుంచి 13 వరకు గండికోట ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. చివరిసారిగా 2020లో వైభంగా జరిగాయి. దీంతో అధికారులు ఏర్పాట్లకు సన్నద్ధమవుతున్నారు.