News March 10, 2025
ASF: 108 అంబులెన్స్లో కవలలు పుట్టారు..!

ఆసిఫాబాద్ మండలం చిర్రకుంటకు చెందిన హరిక అనే మహిళకు పురిటినొప్పులు రాగా కుటుంబ సభ్యులు అంబులెన్స్కు సమాచారాన్ని అందించారు. హారికని అంబులెన్స్లో ఆసిఫాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ఆమెను మంచిర్యాల ఆసుపత్రికి రిఫర్ చేశారు. 108 వాహనంలో మంచిర్యాల తీసుకెళ్తున్న క్రమంలో నొప్పులు అధికం కావడంతో అంబులెన్స్ సిబ్బంది చేశారు. హారిక పండంటి ఆడ కవలలకు జన్మనిచ్చింది. ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.
Similar News
News April 16, 2026
HYD: BREAKING.. మంగ్లీ కేసులో రమావత్ మధు అరెస్ట్

మైక్రో ఫైనాన్స్ మోసాల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రమావత్ మధును సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే మధుపై సైబరాబాద్ పరిధిలోని పలు PSలలో మోసపూరిత కేసులు నమోదు కాగా, తాజా అరెస్టుతో దర్యాప్తులో మరింత వేగం పుంజుకుంది. మైక్రో ఫైనాన్స్ పేరుతో ప్రజలను మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మధును పోలీసులు విచారిస్తున్నారు. ఇక ఈ కేసులో మంగ్లీ సైతం ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
News April 16, 2026
పెండింగ్ కేసుల పరిష్కారం వేగవంతం చేయాలి: ఎస్పీ

అనంతపురంలోని జిల్లా పోలీసు కాన్ఫరెన్స్ హాల్లో SP జగదీష్ ఆధ్వర్యంలో నెలవారీ నేర సమీక్ష జరిగింది. మహిళలపై నేరాలు, గంజాయి నియంత్రణ, మట్కా, బెట్టింగ్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. స్త్రీరక్ష పోర్టల్ ద్వారా వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇవ్వాలని, నైట్ సేఫ్టీ, మైనర్ డ్రైవింగ్ నియంత్రణపై దృష్టి సారించాలని సూచించారు. పెండింగ్ కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు.
News April 16, 2026
పాలమూరు: ఒకేరోజు తల్లి, కొడుకు మృతి

అయిజ మండలం తూముకుంటలో గురువారం విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన కురువ మల్లికార్జున్(37) వ్యవసాయ పనులు చేస్తుండగా అకస్మాత్తుగా మృతి చెందాడు. కుమారుడి మరణ వార్త విన్న తల్లి రంగమ్మ (75) ఇంటి వద్ద ఒక్కసారిగా కుప్ప కూలి మృతి చెందింది. తల్లి కొడుకు ఒకేరోజు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. అతడికి భార్య, కుమార్తె ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


