News March 10, 2025

ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయశాంతి.. అభిమానుల హర్షం

image

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి పేరు ఖరారు కావడంతో మెదక్ ప్రాంతంలో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విజయశాంతి 2009 నుంచి 2014 వరకు మెదక్ ఎంపీగా పనిచేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉండి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేశారు.

Similar News

News March 8, 2026

TODAY HEADLINES

image

* వంట గ్యాస్‌‌ ₹60, కమర్షియల్ గ్యాస్‌పై ₹115 పెంపు
* రాష్ట్రపతి WB పర్యటనలో ప్రొటోకాల్ వివాదం.. PM ఫైర్
* AP: క్వాంటం వ్యాలీతో అనేక మార్పులు: CBN
* AP: లస్కర్ల జీతం రూ.6వేలు పెంపు
* AP: ఇథిలీన్ గ్లైకాల్ కలవడంతోనే పాల కల్తీ
* TG: గద్దర్ అవార్డులు: ఉత్తమ నటి- రష్మిక
* TG: ఒకేసారి 130 మంది మావోల లొంగుబాటు
* TG: ఈనెల 31లోగా లక్ష గృహ ప్రవేశాలు: పొంగులేటి

News March 8, 2026

అనంతబాబు భార్యపై నాన్ బెయిలబుల్ వారెంట్

image

AP: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గకు రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్ ఆమెను ఇటీవల ఈ కేసులో ఏ2గా చేర్చింది. ఈ మేరకు రాజమండ్రి కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేయగా విచారణ చేపట్టింది. తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు.

News March 8, 2026

రాష్ట్రపతి ఘటన: మమత సర్కార్‌పై కిషన్ రెడ్డి ఫైర్

image

బెంగాల్ ప్రభుత్వం రాష్ట్రపతి <<19322594>>ద్రౌపదీ ముర్ము<<>> పట్ల వ్యవహరించిన తీరు దురదృష్టకరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. సంతాళీ తెగ సమ్మేళనాన్ని ఉద్దేశపూర్వకంగానే ఆ జనాభా తక్కువ ఉన్న చోట నిర్వహించడం, కనీస ప్రొటోకాల్ పాటించకుండా CM మమతా బెనర్జీ గైర్హాజరు కావడం గిరిజన జాతులను అవమానించడమేనని విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వారిని రాజకీయాల్లోకి లాగడం ఏమాత్రం సరికాదని ధ్వజమెత్తారు.