News March 10, 2025
ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయశాంతి.. అభిమానుల హర్షం

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి పేరు ఖరారు కావడంతో మెదక్ ప్రాంతంలో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విజయశాంతి 2009 నుంచి 2014 వరకు మెదక్ ఎంపీగా పనిచేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ నుంచి కాంగ్రెస్ టికెట్పై పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉండి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేశారు.
Similar News
News July 7, 2025
అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్కు ప్రభుత్వం ఆమోదం

AP: అమరావతి <<16882676>>క్వాంటమ్ వ్యాలీ<<>> డిక్లరేషన్ను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2035 నాటికి అమరావతిని ప్రపంచ క్వాంటమ్ కేంద్రంగా అభివృద్ధి చేయడమే దీని లక్ష్యమని తెలిపింది. దేశంలోనే అతిపెద్ద క్వాంటమ్ బెడ్గా క్వూ-చిప్-ఇన్ను వచ్చే 12 నెలల్లో ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. 2026లో ప్రారంభమయ్యే అమరావతి క్వాంటమ్ అకాడమీ ద్వారా శిక్షణ, ఫెలోషిప్లు అందజేయాలని నిర్ణయించింది.
News July 7, 2025
కాసేపట్లో ఐసెట్ ఫలితాలు.. Way2Newsలో వేగంగా..

TG: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఐసెట్-2025 ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. జూన్ 8, 9 తేదీల్లో నిర్వహించిన పరీక్షలకు 71, 757 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 64,398 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఫలితాలను అందరికంటే ముందుగా Way2Newsలో వేగంగా, సులభంగా పొందవచ్చు. యాప్ ఓపెన్ చేయగానే కనిపించే స్క్రీన్పై హాల్టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే రిజల్ట్స్ కనిపిస్తాయి.
News July 7, 2025
అమరావతిలో 4 కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్

విజయవాడ: అమరావతిలో 4 కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ఇటీవల జరిగిన CRDA 50వ అథారిటీ సమావేశంలో సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మందడం, తుళ్లూరు, లింగాయపాలెంలో ఒక్కోటి 2.5 ఎకరాలలో 4 ప్రాంతాలలో ఈ సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. అమరావతిలో నిర్మించనున్న 5 నక్షత్రాల హోటళ్ల సమీపంలో QBS విధానంలో ఈ కన్వెన్షన్ సెంటర్లు నిర్మించనున్నట్లు తెలుస్తోంది.