News March 10, 2025
మహబూబాబాద్: కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన వారికి సమచిత స్థానం

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ పేరు ఖరారు చేస్తూ ఏఐసీసీ సెక్రటరీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అద్దంకి దయాకర్ పేరు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఖరారు చేసినందుకు ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన వారికి సముచిత స్థానం దక్కుతుందని ఆనందం వ్యక్తం చేశారు.
Similar News
News March 10, 2025
ALERT: మూడు రోజులు జాగ్రత్త

తెలంగాణలో రాబోయే మూడు రోజులు ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల సమయంలో బయటకు వెళ్లకపోవడం మంచిదని సూచించింది. ఎండ వేడిమి నుంచి రక్షించుకునేందుకు అధికంగా నీరు తాగండి, చెప్పులు ధరించండి, సీజనల్ ఫ్రూట్స్ తినండి. నీరు తాగినప్పటికీ దాహంగా ఉంటే ORS తాగడం బెటర్. టీ- కాఫీలాంటి వాటికి దూరంగా ఉండండి. అధిక ప్రొటీన్ ఆహారం కూడా వద్దు.
News March 10, 2025
జిల్లాల పునర్విభజన సరిగా జరగలేదు: అనగాని

AP: జిల్లాల పునర్విభజనపై అసెంబ్లీలో చర్చ జరిగింది. గత ప్రభుత్వం అశాస్త్రీయంగా జిల్లాలను విభజించిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. ప్రాంతాల మధ్య విభేదాలు వచ్చేలా విభజన జరిగిందన్నారు. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లకు స్థలాలు కేటాయించలేదు. పార్టీ కార్యాలయాలు కట్టుకోవడంపై చూపించిన శ్రద్ధ ప్రభుత్వ కార్యాలయాలపై చూపలేదని ఎద్దేవా చేశారు. అవసరమైన చోట్ల త్వరలో కలెక్టరేట్లు నిర్మిస్తామని తెలిపారు.
News March 10, 2025
‘మన వికారాబాద్ బిడ్డను బతికించుకుందాం’

వికారాబాద్ జిల్లా తాండూరు పరిధి యాలాల్ మండలం సంగెం గ్రామానికి చెందిన భానుప్రియ, శివకుమార్ దంపతుల 9 నెలల బాబు వశిష్ఠ ‘బైలేరియా అట్రే సై’ అనే కాలేయ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. చికిత్సకు రూ.22 లక్షలు అవసరమని చెప్పడంతో <<15707873>>దాతల కోసం<<>> తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. కాగా మన వికారాబాద్ బిడ్డను బతికించుకుందామని ఇప్పటికే కాంగ్రెస్ నేత బుయ్యని శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.