News March 10, 2025

MHBD: డోర్నకల్‌కు యంగ్ ఇండియా గురుకులం

image

యంగ్​ ఇండియా ఇంటిగ్రేటెడ్​ గురుకుల పాఠశాలల నిర్మాణానికి రూ.11 వేల కోట్లను విద్యాశాఖ మంజూరు చేసింది. 55 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురుకుల పాఠశాలల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. ఒక్కో స్కూల్​కు రూ.200 కోట్లు చొప్పున పరిపాలన అనుమతులను మంజూరు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో డోర్నకల్ నియోజకవర్గంలో ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.

Similar News

News March 10, 2025

50-30-20 రూల్‌ పాటిస్తున్నారా?

image

సంపాదించిన డబ్బును ఎలా ఉపయోగించాలో తెలిసినవాడు గొప్పవాడు అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. జీతంలో 50% ఇంటి అవసరాలు, హెల్త్ కేర్, రవాణా, పర్సనల్ కేర్, నిత్యావసర వస్తువుల కోసం ఖర్చు చేయాలి. మరో 30% షాపింగ్స్, ఔటింగ్స్ వంటి కోరికల కోసం ఉంచుకోండి. మిగతా 20శాతం మాత్రం పొదుపు చేయాలి. ప్రతి నెలా డబ్బును పొదుపు చేస్తూ భవిష్యత్తు కోసం పెట్టుబడులు ప్రారంభించండి. ఎమర్జెన్సీ ఫండ్‌ మెయింటేన్ చేయండి. SHARE IT

News March 10, 2025

మిర్యాలగూడ: కోర్టు తీర్పు.. పేరెంట్స్, అమృత భావోద్వేగం

image

మిర్యాలగూడ <<15710555>>ప్రణయ్ హత్య<<>> కేసులో కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఇప్పటికే మారుతీరావు ఆత్మహత్య చేసుకోగా A2 సుభాష్ శర్మకు ఉరిశిక్ష, A3 అజ్గర్ అలీ, A4 అబ్దుల్లా బారీ, A5 కరీం, A6 శ్రావణ్, A7 శివ, A8 నిజాంకు యావజ్జీవ శిక్షను కోర్టు విధించింది. కాగా కోర్టు తీర్పు అనంతరం మిర్యాలగూడలోని ప్రణయ్ సమాధి వద్ద పూలు వేసి పలువురు నివాళులర్పించారు. ప్రణయ్ తల్లిదండ్రులు, భార్య అమృత కన్నీటి పర్యంతమయ్యారు.

News March 10, 2025

తిరుపతి జిల్లాలో మొదలైన భానుడి ప్రతాపం

image

తిరుపతి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలలో ఎండలు మండిపోతున్నాయి. మార్చి రెండో వారంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ఎండల దెబ్బకు సత్యవేడు, వరదయ్యపాలెం, బుచ్చినాయుడుకండ్రిగ తదితర ప్రాంతాలలో ఉదయం 11 గంటలకే రోడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయంటూ స్థానికులు వాపోతున్నారు. వయస్సు పైబడిన వారు పని ఉంటే తప్ప బయటకు రావద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. మీ ప్రాంతంలోనూ ఇలాగే ఉంటే కామెంట్ చేయండి.

error: Content is protected !!