News March 10, 2025

సంగారెడ్డి జిల్లాలో 122 టెన్త్ పరీక్ష కేంద్రాలు

image

సంగారెడ్డి జిల్లాలో ఈనెల 21 నుంచి జరిగే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు 122 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సంవత్సరం 22,411 మంది విద్యార్థులు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయనున్నట్లు చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.

Similar News

News March 19, 2026

నాగార్జునసాగర్ 115 టీఎంసీల షిల్ట్ పూడిక

image

కృష్ణానదిపై నిర్మించిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూడికతో కుదేలవుతోంది. అసలు 427 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన ఈ జలాశయంలో ప్రస్తుతం సుమారు 115 టీఎంసీల వరకు పూడిక పేరుకుపోయినట్లు తెలుస్తోంది. పూడికతో ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలకు చేరింది. దీంతో జలాశయంలో నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా తగ్గి సాగు, తాగునీటి అవసరాలపై ప్రభావం పడుతోంది.

News March 19, 2026

పాక్‌లో ఆర్థిక సంక్షోభం.. రిపబ్లిక్ డే వేడుకలు రద్దు

image

పశ్చిమాసియాలో యుద్ధంతో పాకిస్థాన్‌లో ఇంధన, ఆర్థిక సంక్షోభం పెరిగిపోయింది. దీంతో మార్చి 23న ఇస్లామాబాద్‌లో జరగాల్సిన రిపబ్లిక్ డే పరేడ్‌ను ప్రధాని షెహబాజ్ షరీఫ్ రద్దు చేశారు. జెండా ఆవిష్కరణ మాత్రమే ఉంటుందని తెలిపారు. దీంతో సైనిక కవాతు, 31 గన్ సెల్యూట్, సాంస్కృతిక కార్యక్రమాలు ఉండవు. దేశ గౌరవానికి నిదర్శనంగా నిలిచే వేడుకలు రద్దు కావడం ఆ దేశ దుర్భర స్థితికి నిదర్శనమని పలువురు పేర్కొంటున్నారు.

News March 19, 2026

నల్గొండ: పుచ్చకాయకు దక్కని ధర: రైతు కుదేలు

image

ఈ వేసవిలో జిల్లాలో సుమారు 2000 ఎకరాల్లో పుచ్చకాయ సాగు చేసిన రైతులు మార్కెట్‌లో ధరలు పడిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. పెద్దవూర మండలంలోని పలు గ్రామాల్లో సాగు పెరగడం, పంట ఒక్కసారిగా మార్కెట్‌కు రావడంతో గతంలో రూ.30 పలికిన ధర ప్రస్తుతం రూ.6 నుండి 7కి పడిపోయింది. దీంతో పెట్టుబడి కూడా రాక రైతులు భారీ నష్టాలను చవిచూస్తున్నారు. సాగు చేసిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.