News March 10, 2025
పార్వతీపురం: దరఖాస్తుల ఆహ్వానం

సమగ్ర శిక్ష కార్యాలయంలో ఖాళీగా ఉన్న సెక్టోరియల్, అసిస్టెంట్ సెక్టోరియల్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ ఎన్ తిరుపతి నాయుడు తెలిపారు. జిల్లాలో 15 మండలాల ZPHS, మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న అర్హత గల ఉపాధ్యాయులు 12వ తేదీలోగా డీఈఓ కార్యాలయానికి వివరాలు తెలియజేయాలన్నారు. మరిన్ని వివరాలకు వెబ్సైట్ను సంప్రదించాలన్నారు.
Similar News
News March 10, 2025
విజయవాడ: వల్లభనేని వంశీ కేసులో అప్డేట్

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ వాయిదా పడింది. కౌంటర్ దాఖలుకు సత్యవర్ధన్ న్యాయవాది సమయం కోరారు. విచారణ అనంతరం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది. అలాగే వంశీని కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్ కూడా వాయిదా పడింది. వంశీ భద్రత రీత్యా బ్యారక్ మార్చలేమని అధికారులు న్యాయమూర్తికి వివరించారు.
News March 10, 2025
2027 వన్డే WCకు ముందు 24 వన్డేలు

నెక్స్ట్ వన్డే ప్రపంచకప్ 2027 OCT, NOVలో సౌతాఫ్రికాలో జరగనుంది. అప్పటివరకు టీమ్ ఇండియా 24 వన్డేలు ఆడనుంది. బంగ్లా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గానిస్థాన్, ఇంగ్లండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్, శ్రీలంకలతో మూడేసి వన్డేలు ఉన్నాయి. ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో వారి సొంతగడ్డపైనే తలపడాల్సి ఉంది. అప్పటివరకు రోహిత్, కోహ్లీ వన్డేల్లో కొనసాగుతారా? కామెంట్ చేయండి.
News March 10, 2025
రేవంత్కు మానవత్వం కూడా లేదని తేలిపోయింది: KTR

TG: CM రేవంత్ అసమర్థత వల్లే గురుకులాల్లో విద్యార్థుల మరణాలు చోటు చేసుకుంటున్నాయని KTR విమర్శించారు. ఇవి కాంగ్రెస్ సర్కారు చేసిన హత్యలేనని మండిపడ్డారు. ‘ఆదిలాబాద్(D) ఇచ్చోడ బాలికల ఆశ్రమ పాఠశాలలో లాలిత్య అనే విద్యార్థిని అనుమానాస్పదంగా మృతిచెందడం తీవ్ర దిగ్భ్రాంతికరం. పుట్టెడు దుఃఖంలో ఉన్న తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం దుర్మార్గం. రేవంత్కు మానవత్వం కూడా లేదని తేలిపోయింది’ అని ట్వీట్ చేశారు.