News March 10, 2025
మేడారం జాతరకు అప్రమత్తంగా ఉండాలి: సీతక్క

ములుగు జిల్లాలో అధికారులు క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులను పరిశీలించాలని మంత్రి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలో ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీతక్క మాట్లాడుతూ.. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను అనుకున్న సమయంలో పూర్తి చేయాలన్నారు. రానున్న మహా మేడారం జాతరకు అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News March 24, 2026
పోలవరం: తల్లి మరణం.. దుఃఖాన్ని దిగమింగుకుంటూ పరీక్ష రాసిన విద్యార్థిని

తల్లి మరణించిన దుఃఖంలో టెన్త్ పరీక్ష రాసింది ఓ విద్యార్థిని. ఈ సంఘటన పోలవరం జిల్లా రాజవొమ్మంగిలో సోమవారం చోటు చేసుకుంది. కొయ్యురు మండలం కొత్తపల్లికి చెందిన సావిత్రి తల్లి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందింది. రాజవొమ్మంగి బాలికల ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఆ బాలిక సోమవారం లెక్కలు పరీక్ష రాసింది. దుఃఖాన్ని దిగమింగుకుంటూ ఆమె పరీక్ష రాయడంతో తోటి విద్యార్థినులు, టీచర్స్ చలించిపోయారు.
News March 24, 2026
కురులు ఆరోగ్యంగా ఉండాలంటే..

మనం తినే ఆహారం ద్వారా చేరే పోషకాలను శరీరం ప్రధాన అంతర్గత అవయవాల కోసం కేటాయిస్తుంది. వాటిలో మిగిలినవి మాత్రమే వెంట్రుకలు, గోళ్లకు వెళ్తాయి. సరిపడా పోషకాలు తీసుకోకపోతే వెంట్రుకల మీద ఆ ప్రభావం పడి, రాలిపోతూ ఉంటాయి. కాబట్టి వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండాలంటే, పోషకాహారంతోపాటు, విటమిన్ ఇ, డి, సి, బి – కాంప్లెక్స్ అందేలా చూసుకోవాలి. ఇందుకోసం తాజా ఆకుకూరలు, కూరగాయలు, మాంసకృత్తులు సరిపడా అందించాలి.
News March 24, 2026
అల్లూరి: తాటిచెట్టుపై నుంచి జారిపడి వ్యక్తి మృతి

ఎటపాక (M) ఎం.నల్లకుంట గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కూరం మల్లయ్య (60) కల్లు గీసేందుకు తాటిచెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు పట్టుతప్పి కిందపడిపోయారు. తీవ్ర గాయాలైన మల్లయ్యను కుటుంబ సభ్యులు వెంటనే గౌరీదేవిపేట పీహెచ్సీకి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మల్లయ్య మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.


