News March 10, 2025
నర్సీపట్నం: ఇంటర్ పరీక్షల్లో అనుచిత తనిఖీలు

నర్సీపట్నం ఏబీఎం కాలేజీలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో తనిఖీల పేరిట విద్యార్థులతో డ్యూటీ ఆఫీసర్ ప్రసాద్ అనుచిత వైఖరి ప్రదర్శించినట్లు విమర్శలొచ్చాయి. దీంతో అతనిని ఆ విధులు నుంచి తప్పించినట్లు ఇంటర్ విద్యాశాఖ అధికారిణి సుజాత తెలిపారు. విద్యార్థులు చేసిన ఆరోపణలపై విచారణ చేపట్టామని నేరం రుజువు కావడంతో చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.
Similar News
News September 18, 2025
KNR: ‘ప్రపంచమంతా ఒకే సైన్ లాంగ్వేజ్ ఉండాలి’

అంతర్జాతీయ సైన్ లాంగ్వేజి వారోత్సవాలు ఈనెల 22 నుంచి 28 వరకు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా విద్యానగర్ లోని ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాలలో ముందస్తు అంతర్జాతీయ సైన్ లాంగ్వేజి దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. ప్రపంచమంతా ఒకే సైన్ లాంగ్వేజి ఉండడం ద్వారా అంతర్జాతీయంగా దివ్యాంగులకు ఎంతో మేలు జరుగుతుందని సూచించారు.
News September 18, 2025
పనులు నాణ్యతతో చేపట్టండి: కలెక్టర్

పాణ్యం నుంచి గోరుకల్లు రిజర్వాయర్ వరకు రూ.6.29 కోట్లతో నిర్మించిన రహదారి పనులను కలెక్టర్ జి.రాజకుమారి గురువారం పరిశీలించారు. కొండజుటూరు, గోరుకల్లు, ఎస్.కొట్టాల, దుర్వేసి గ్రామాలను కలుపుతూ 13.125 కి.మీ. పొడవున పూర్తయిన రహదారి పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు, సాగు నీరు, రవాణా సౌకర్యాలు కల్పించడమే ఈ పనుల ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ స్పష్టం చేశారు.
News September 18, 2025
ఇకపై మరింత సులభంగా EPFO సేవలు

EPFO <