News March 10, 2025
జుక్కల్కు రూ.200 కోట్లు

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు నిధులు మంజూరు చేస్తూ Dy.CM భట్టి విక్రమార్క ఉత్తర్వులు విడుదల చేశారు. సువిశాల స్థలంలో ఇంటర్నేషనల్ స్థాయి విద్యకు దీటుగా నిర్మిస్తున్నామని తెలిపారు. ఇక్కడి విద్యార్థులు ప్రపంచంతో పోటీపడుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గానికి రూ.200 కోట్లు మంజూరయ్యాయి.
Similar News
News July 5, 2025
సుల్తానాబాద్: కేజ్ వీల్స్తో రోడెక్కిన ట్రాక్టర్కు జరిమానా

సుల్తానాబాద్ పట్టణం రోడ్లపై కేజ్ వీల్స్ ట్రాక్టర్లు తిరిగితే జరిమానాతోపాటు కేసులు నమోదు చేస్తామని సుల్తానాబాద్ ఎస్సై శ్రావణ్ కుమార్ హెచ్చరించారు. శుక్రవారం మండలంలోని చిన్న బొంకూర్ గ్రామానికి చెందిన భూత గడ్డ చంద్రయ్య తన కేజ్ వీల్స్ ట్రాక్టర్తో రోడ్డుపై వెళుతుండగా అదుపులోకి తీసుకుని కేజ్ వీల్ ట్రాక్టర్ను తహశీల్దార్ కార్యాలయానికి తరలించారు. మొదటిసారి తప్పుగా భావించి MRO రూ.5వేల జరిమానా విధించారు.
News July 5, 2025
IIIT లిస్ట్.. ఒకే స్కూల్ నుంచి 26 మంది ఎంపిక

TG: నిన్న విడుదలైన బాసర IIIT <<16941421>>జాబితాలో<<>> నిజామాబాద్ జిల్లాలోని డొంకేశ్వర్ ZPHS విద్యార్థులు సత్తాచాటారు. ఏకంగా ఈ స్కూలు నుంచి 26 మంది ఎంపికయ్యారు. వీరిలో 19 మంది అమ్మాయిలు, ఏడుగురు అబ్బాయిలు ఉన్నారు. ఈ మండలం నుంచి 41 మంది స్టూడెంట్స్ సెలక్ట్ అవ్వడం గమనార్హం. ఎంపికైన విద్యార్థులకు స్కూల్ సిబ్బంది అభినందనలు తెలిపారు. కాగా తొలి విడతలో 1,690 మంది ఎంపికయ్యారు.
News July 5, 2025
దంతాలపల్లి దాన కర్ణుడు చిన్న వీరారెడ్డి మృతి

దంతాలపల్లి మండల కేంద్రంలోని సబ్ స్టేషన్, జడ్పీహెచ్ఎస్, ప్రాథమిక పాఠశాలల నిర్మాణం కోసం తన సొంత స్థలాన్ని విరాళంగా ఇచ్చి దాన కర్ణుడిగా పేరొందిన యెల్లు చిన్న వీరారెడ్డి(85) ఇకలేరు. కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం మరణించారు. ఆయన గ్రామానికి చేసిన సేవలు చిరకాలం స్మరించుకుంటామని గ్రామస్థులు పేర్కొన్నారు.