News March 10, 2025

టీడీపీలోనే ఉంటా.. ఏ పార్టీలో చేరను: జేసీ పవన్ రెడ్డి

image

పార్టీ మార్పుపై ప్రచారాన్ని JC పవన్ రెడ్డి కొట్టిపారేశారు. తాను టీడీపీలో ఉన్నానని, ఏ పార్టీలో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వైసీపీలోకి వెళ్తున్నట్లు చెప్పడానికే మాజీ మంత్రి శైలజానాథ్ తనను కలిశారని, నిర్ణయం తీసుకున్నాక తాను ఏమి చేయగలనని, ఆల్ ది బెస్ట్ చెప్పినట్లు తెలిపారు. దావోస్ పర్యటనలో అనంతపురం జిల్లాలో రూ.1000కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రెండు కంపెనీలతో ఎంవోయూ కుదర్చగలిగానని చెప్పారు.

Similar News

News March 13, 2026

SKU నూతన వైస్ ఛాన్స్‌లర్‌గా జ్యోతి కుమార్

image

శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నూతన వైస్ ఛాన్స్‌లర్‌గా NVR జ్యోతి కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన మిజోరాం యూనివర్సిటీలో కామర్స్ విభాగంలో సీనియర్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఇప్పటి నుంచి 3 ఏళ్ల పాటు ఈయన వైస్ ఛాన్స్‌లర్‌గా కొనసాగనున్నారు.

News March 13, 2026

అనంత: ‘బాలుడి హత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు’

image

అనంతపురం జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సెట్టూరు మండలం తిప్పనపల్లి గ్రామంలో ఆస్తి తగాదాల వల్ల 2022లో బాలుడిని ముగ్గురు వ్యక్తులు హత్య చేశారు. సెట్టూరు పోలీస్ స్టేషన్ క్రైమ్ నెం.70/2022 u/s 302 r/w 34 IPC సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మైనర్ బాలుడి హత్య కేసులో ముగ్గురికి (చిట్టప్ప, ఈరన్న, ముకుందప్ప) కఠిన జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.

News March 13, 2026

భార్యను చంపిన హత్య కేసులో భర్త అరెస్ట్

image

పెద్దపప్పూరు మండలం ముచ్చుకోట అటవీ ప్రాంతంలో భార్యను చంపిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. తాడిపత్రికి చెందిన శ్రీలేఖ ప్యాపిలి మండలం నల్లమేకలపల్లికి చెందిన సుధాకర్‌ను వివాహం చేసుకుంది. అయితే భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో భక్త సుధాకర్ శ్రీలేఖను చున్నీతో మెడకు బిగించి హత్య చేసి పడివేశారన్నారు. సుధాకర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ రామసుబ్బయ్య తెలిపారు.