News March 10, 2025
కృష్ణా: ఈనెల 19న మల్లవల్లి పారిశ్రామికవాడ ప్రారంభం

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి పారిశ్రామికవాడ ఈనెల 19న ప్రారంభం కానుంది. ప్రభుత్వం పనులను వేగవంతం చేయడంతో అశోక్ లేలాండ్ బస్సు బిల్డింగ్ యూనిట్ సిద్ధమైంది. 2018లో చంద్రబాబు శంకుస్థాపన చేసిన ఈ యూనిట్ను మార్చి 19న మంత్రి లోకేశ్ ప్రారంభించనున్నారు. మరికొన్ని పరిశ్రమలు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి. మొత్తం ఈ పారిశ్రామిక వాడ 1,467 ఎకరాల విస్తీర్ణంలో ఉంది.
Similar News
News March 10, 2025
బాపులపాడులో అధిక ఉష్ణోగ్రతలు.. తగ్గని వేడి.!

కృష్ణా జిల్లా గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు మండలాల్లో నేడు బయట ఎండ తీవ్రత కనిపించకపోయినా, ఉష్ణోగ్రతలు మాత్రం తగ్గలేదు. బాపులపాడు, ఉంగుటూరు మండలాల్లో 35 డిగ్రీలు, గన్నవరంలో 36 డిగ్రీలు నమోదయ్యాయి. పైగా గాలిలేని వాతావరణం ఉక్కపోతను మరింత పెంచింది. “గాలి లేక అసలే ఉమ్మటేసింది!” అని స్థానికులు అంటున్నారు.
News March 10, 2025
గన్నవరం: వంశీ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా

విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో వంశీ బెయిల్ పిటిషన్పై సోమవారం విచారణ జరిగింది. ప్రభుత్వ తరఫు న్యాయవాది సత్యవర్ధన్ కౌంటర్ దాఖలుకు రెండు రోజులు సమయం కోరారు. దీంతో విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది. గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి కేసులో ఏ71గా వల్లభనేని వంశీ ఉన్నారు. ఇటీవల నియోజకవర్గ వ్యాప్తంగా ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి.
News March 10, 2025
కృష్ణా జిల్లాలో రాత్రి గస్తీ కట్టుదిట్టం

కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర రావు ఐపీఎస్ ఆదేశాలతో ఆదివారం రాత్రి గస్తీ పటిష్ఠంగా కొనసాగుతోంది. నేర నియంత్రణ, దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకునేందుకు అనుమానిత వాహనాలు, ప్రయాణికుల తనిఖీ, సీసీ కెమెరాల పర్యవేక్షణ చేపట్టారు. హైవేలపై డ్రైవర్లకు అవగాహన కల్పించి, బస్టాండ్లు, లాడ్జిలలో కొత్త వారి వివరాలు సేకరిస్తున్నారు.