News March 10, 2025

గుంటూరు: క్వశ్చన్ పేపర్ లీక్.. తీగలాగితే డొంక కదిలింది

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బీఈడీ ప్రశ్నా పత్రాల లీకేజీ విషయంలో 9 మంది ఏజెంట్లతో పాటూ వినుకొండలో ఓ కళాశాలకు చెందిన ఛైర్మన్, కంప్యూటర్ ఆపరేటర్ కీలకపాత్ర పోషించారు. ANU ఈ మేరకు తెనాలిలో ఓ వ్యక్తిని విచారించగా సామాజిక మాధ్యమం ద్వారా ప్రశ్నాపత్రం తనకు వచ్చిందని అన్నారు. ఆ తర్వాత లోతుగా దర్యాప్తు చేపట్టగా ప్రశ్నాపత్రం వినుకొండ నుంచి అందరికీ ఫార్వర్డ్ అయినట్లు నిర్ధారించుకున్నారు.

Similar News

News March 10, 2025

కలెక్టర్ క్రాంతిని కలిసిన ఎస్పీ

image

సంగారెడ్డి జిల్లా నూతన ఎస్పీగా పరితోష్ పంకజ్ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతిని ఎస్పీ కలిశారు. ఎస్పీకి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకై కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.

News March 10, 2025

నిజామాబాదులో ప్రజావాణికి 95 ఫిర్యాదులు

image

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 95 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీపీఓ శ్రీనివాస్ లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు అధికారులను ఆదేశించారు.

News March 10, 2025

విజయవాడ: వల్లభనేని వంశీ కేసులో అప్డేట్

image

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్‌ పిటిషన్‌ వాయిదా పడింది. కౌంటర్‌ దాఖలుకు సత్యవర్ధన్‌ న్యాయవాది సమయం కోరారు. విచారణ అనంతరం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది. అలాగే వంశీని కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్ కూడా వాయిదా పడింది. వంశీ భద్రత రీత్యా బ్యారక్‌ మార్చలేమని అధికారులు న్యాయమూర్తికి వివరించారు. 

error: Content is protected !!