News March 10, 2025

గరుగుబిల్లి : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

గరుగుబిల్లి మండలం సుంకి గ్రామ ప్రధాన రహదారి వద్ద సోమవారం ఉదయం జరిగిన యాక్సిడెంట్‌లో ఒకరు మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. లారీ, కారు ఢీకొన్న సంఘటనలో ఒక వ్యక్తి మృతి చెందినట్లు తెలిపారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో 108 ద్వారా పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై గరుగుబిల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

Similar News

News March 10, 2025

ఓటముల బాధ్యుడు గౌతీ CT విజయానికి అవ్వరా..!

image

ట్రాన్సిషన్ పీరియడ్లో కోచింగ్ అంత ఈజీ కాదు. Sr వెళ్లిపోయే, Jr తమ ప్లేస్‌ను సుస్థిరం చేసుకుంటున్న వేళ జట్టుకూర్పు సంక్లిష్టంగా ఉంటుంది. ఏ పరిస్థితుల్లో, ఏ ప్లేసులో, ఎవరెలా ఆడతారో తెలియాలంటే ప్రయోగాలు తప్పనిసరి. ప్రతి ప్రయోగం సక్సెస్ అవుతుందన్న రూలేం లేదు. ఇది అర్థం చేసుకోలేకే శ్రీలంక, కివీస్‌ చేతుల్లో ఓడగానే వేళ్లన్నీ గౌతీవైపే చూపాయి. మరిప్పుడు CT విజయ కీర్తి అతడికి దక్కినట్టేనా! విమర్శలు ఆగేనా!

News March 10, 2025

అంతర్జాతీయ సహకార సంవత్సరంగా 2025: కలెక్టర్

image

2025 సంవత్సరాన్ని అంతర్జాతీయ సహకార ఏడాదిగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిందని జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు సోమవారం అన్నారు. సహకార సంఘాల ద్వారా బహుళార్థక సేవా కార్యక్రమాలు అమలు చేయాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తులను నిలువ చేసుకునే సదుపాయం కల్పించాలన్నారు. యువతను సహకార సంఘాలలోకి తీసుకొని రావాలన్నారు. కంప్యూటరీకరణ పూర్తిగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు సూచించారు.

News March 10, 2025

పదవులు రాలేదని ఆందోళన చెందొద్దు: లోకేశ్

image

AP: పదవులు రాలేదని ఎవరూ ఆందోళన చెందొద్దని మంత్రి లోకేశ్ అన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారందరికీ పదవులు వస్తాయని భరోసా కల్పించారు. MLCలుగా బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించామని పేర్కొన్నారు. దీంతో బలహీనవర్గాలపై TDP చిత్తశుద్ధి మరోసారి చాటుకుందన్నారు. మహిళలు, యువతను ప్రోత్సహించేందుకే గ్రీష్మకు అవకాశం ఇచ్చామని తెలిపారు. MLA కోటా MLC సీటు ఆశించిన పలువురు సీనియర్లకు నిరాశ ఎదురైన విషయం తెలిసిందే.

error: Content is protected !!