News March 10, 2025

టీడీపీలోనే ఉంటా.. ఏ పార్టీలో చేరను: జేసీ పవన్ రెడ్డి

image

పార్టీ మార్పుపై ప్రచారాన్ని JC పవన్ రెడ్డి కొట్టిపారేశారు. తాను టీడీపీలో ఉన్నానని, ఏ పార్టీలో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వైసీపీలోకి వెళ్తున్నట్లు చెప్పడానికే మాజీ మంత్రి శైలజానాథ్ తనను కలిశారని, నిర్ణయం తీసుకున్నాక తాను ఏమి చేయగలనని, ఆల్ ది బెస్ట్ చెప్పినట్లు తెలిపారు. దావోస్ పర్యటనలో అనంతపురం జిల్లాలో రూ.1000కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రెండు కంపెనీలతో ఎంవోయూ కుదర్చగలిగానని చెప్పారు.

Similar News

News March 10, 2025

అల్లూరి జిల్లాలో 115 మంది గైర్హాజరు

image

అల్లూరి జిల్లాలో ఇంటర్ సెకండియర్ వ్యాథ్స్, జువాలజి, హిస్టరీ పరీక్షలు సోమవారం జరిగాయి. ఈ జనరల్ పరీక్షలకు 26పరీక్ష కేంద్రాల్లో 4,315 మంది హాజరు కావాల్సి ఉండగా 4,200 మంది పరీక్షకు హాజరయ్యారు. 115 మంది పరీక్షకు హాజరుకాలేదని ఇంటర్మీడియట్ విద్యాశాకాధికారి అప్పలరాం తెలిపారు. ఒకేషనల్ పరీక్షలకు 1217మందికి 1136మంది రాశారని వెల్లడించారు. జిల్లా అంతటా ప్రశాంతంగా పరీక్షలు జరిగాయని పేర్కొన్నారు.

News March 10, 2025

రాష్ట్రంలో భారీ స్కామ్: కేటీఆర్

image

TG: రాష్ట్రంలో భారీ స్కామ్‌కు తెరలేసిందని, టీడీఆర్ బాండ్ల పేరుతో రూ.వేల కోట్లు కొల్లగొట్టేందుకు CM రేవంత్ టీమ్ సిద్ధమవుతోందని KTR ఆరోపించారు. రేవంత్‌కు చెందిన నలుగురు వ్యక్తులు HYDలో విచ్చలవిడిగా టీడీఆర్‌లు కొంటున్నారని పేర్కొన్నారు. ‘ఫార్ములా ఈ- రేసుకు రూ.45కోట్లు ఖర్చు చేస్తే తప్పు అన్నారు. ఇప్పుడు అందాల పోటీకి రూ.200కోట్లు ఖర్చు చేస్తారట. దీని వల్ల ఏమైనా లాభం ఉందా?’ అని ప్రశ్నించారు.

News March 10, 2025

సోంపేట: 5 రోజుల వ్యవధిలో భార్యాభర్తల మృతి

image

సోంపేట మండలం కొర్లాం పంచాయతీ లక్ష్మీపురం గ్రామంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీగా పనిచేసిన తామాడ గణపతి సోమవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఈయన భార్య తామాడ భారతి కూడా సరిగా 5 రోజుల ముందు మరణించడంతో కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆమె కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీగా పనిచేశారు.

error: Content is protected !!