News March 10, 2025
ఓరుగల్లులో భూముల ధరకు రెక్కలు!

WGL జిల్లాలోని భూముల ధరలకు రెక్కలొచ్చాయి. మామునూరు ఎయిర్పోర్టు నిర్మాణానికి కేంద్రం ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ప్రస్తుతం మామునూరులో దాదాపు రూ.2కోట్లకు పైనే ధర పలుకుతున్నట్లు రియల్ వర్గాలు చెబుతున్నాయి. భూ నిర్వాసిత గ్రామాల రైతులు మాత్రం ఎకరాకు రూ.5 కోట్లు ఇవ్వాలని, తమ గ్రామం నుంచే హైవే వెళ్లాలని డిమాండ్ చేస్తున్నారు. మీ ప్రాంతంలో భూముల ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
Similar News
News October 28, 2025
ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మకు భారీ ఆదాయం

ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర దేవస్థానం హుండీలను సోమవారం లెక్కించగా, రూ. 4,33,85,655 ఆదాయం లభించింది. దీంతో పాటు 420 గ్రాముల బంగారం, 6 కిలోల 614 గ్రాముల వెండి, వివిధ దేశాల కరెన్సీని భక్తులు సమర్పించారు. ఈవో శీనా నాయక్ పర్యవేక్షణలో 44 హుండీలను లెక్కించారు. ఈ లెక్కింపులో ఆలయ ఛైర్మన్తో పాటు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
News October 28, 2025
KNR: కీచక అటెండర్.. ఉద్యోగం నుంచి సస్పెండ్

KNR జిల్లా గంగాధర(M) కురిక్యాల ZPHSలోని బాలికల బాత్రూంలో అటెండర్ కెమెరా అమర్చిన ఘటన చర్చనీయాంశంగా మారింది. దీంతో అటెండర్ యాకుబ్ పాషాను ఉద్యోగం నుంచి తొలగిస్తూ సోమవారం కరీంనగర్ జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా అటెండర్ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. దీనిపై MLA సత్యం, కేంద్రమంత్రి బండి, మాజీ MLA రవిశంకర్ స్పందించారు. ప్రతిపక్షాలూ గంగాధర ప్రధాన చౌరస్తాలో బైఠాయించాయి.
News October 28, 2025
NLG: 21 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్..!

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎట్టకేలకు 21 ఏళ్ల తర్వాత స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) చేయనున్నట్లు ఈసీ ప్రకటించింది. 1951 నుంచి 2004 వరకూ 8 సార్లు SIR నిర్వహించారు. చివరి సారిగా 21 ఏళ్ల క్రితం 2002-2004 మధ్య చేపట్టారు. జిల్లాలో బీఎల్వోలు త్వరలోనే మ్యాచింగ్ కాని ఓటర్ల ఇళ్లకు వెళ్లి ఓట్లు ఎలా పొందారో.. దానికి కావాల్సిన పత్రాలను ఓటర్ల నుంచి స్వీకరించనున్నారు.


