News March 10, 2025
40 డిగ్రీలు దాటనున్న పగటి ఉష్ణోగ్రతలు

TG: మరో వారం రోజుల్లో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే 5 రోజుల్లో సగటు ఉష్ణోగ్రతలు 36-40 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. నిన్న అత్యధికంగా నల్గొండ (D) చిట్యాలలో 39.8 డిగ్రీలు నమోదైంది. KNR, HNK, BHPL, KMR, ASF, NZB, మేడ్చల్, నారాయణ్ పేట్, నిర్మల్, PDPL, SDPT, వనపర్తి, MHBD జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 39.7డిగ్రీలుగా రికార్డ్ అయింది.
Similar News
News March 10, 2025
ఓటముల బాధ్యుడు గౌతీ CT విజయానికి అవ్వరా..!

ట్రాన్సిషన్ పీరియడ్లో కోచింగ్ అంత ఈజీ కాదు. Sr వెళ్లిపోయే, Jr తమ ప్లేస్ను సుస్థిరం చేసుకుంటున్న వేళ జట్టుకూర్పు సంక్లిష్టంగా ఉంటుంది. ఏ పరిస్థితుల్లో, ఏ ప్లేసులో, ఎవరెలా ఆడతారో తెలియాలంటే ప్రయోగాలు తప్పనిసరి. ప్రతి ప్రయోగం సక్సెస్ అవుతుందన్న రూలేం లేదు. ఇది అర్థం చేసుకోలేకే శ్రీలంక, కివీస్ చేతుల్లో ఓడగానే వేళ్లన్నీ గౌతీవైపే చూపాయి. మరిప్పుడు CT విజయ కీర్తి అతడికి దక్కినట్టేనా! విమర్శలు ఆగేనా!
News March 10, 2025
పదవులు రాలేదని ఆందోళన చెందొద్దు: లోకేశ్

AP: పదవులు రాలేదని ఎవరూ ఆందోళన చెందొద్దని మంత్రి లోకేశ్ అన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారందరికీ పదవులు వస్తాయని భరోసా కల్పించారు. MLCలుగా బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించామని పేర్కొన్నారు. దీంతో బలహీనవర్గాలపై TDP చిత్తశుద్ధి మరోసారి చాటుకుందన్నారు. మహిళలు, యువతను ప్రోత్సహించేందుకే గ్రీష్మకు అవకాశం ఇచ్చామని తెలిపారు. MLA కోటా MLC సీటు ఆశించిన పలువురు సీనియర్లకు నిరాశ ఎదురైన విషయం తెలిసిందే.
News March 10, 2025
గ్రూప్-1 ఫలితాలు విడుదల

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం రిజల్ట్స్ రిలీజ్ చేశారు. అభ్యర్థులు అధికారిక <