News March 10, 2025
మిర్యాలగూడ: ఆరేళ్లుగా కోర్టులోనే ప్రణయ్ హత్య కేసు విచారణ

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు దాదాపు <<15708073>>ఆరేళ్లుగా కోర్టులోనే<<>> విచారణ కొనసాగుతోంది.ఎట్టకేలకు ఈరోజు తుది తీర్పు రానుంది. కాగా A1గా ఉన్న మారుతీరావు ఆత్మహత్య చేసుకోగా ప్రణయ్ను చంపిన బిహార్ వాసి సుభాష్ శర్మ A2గా, అజ్గర్ అలీ A3గా ,అబ్దుల్లా బారీ A4గా, MA కరీం A5గా, మారుతీరావు తమ్ముడు శ్రావణ్ A6గా, డ్రైవర్ శివ A7గా, నిజాం A8గా ఉన్నారు. ఈరోజు నిందితులకు కోర్టు శిక్ష ఖరారు చేయనుంది.
Similar News
News December 30, 2025
నెల్లూరు జిల్లాలో డివిజన్లు ఇలా..!

➤నెల్లూరు(12): సైదాపురం, రాపూరు, పొదలకూరు, వెంకటాచలం, మనుబోలు, టీపీ గూడూరు, ముత్తుకూరు, ఇందుకూరుపేట, కోవూరు, బుచ్చి, నెల్లూరు సిటీ, రూరల్
➤కావలి(12): వీకే పాడు, కొండాపురం, వింజమూరు, కొడవలూరు, విడవలూరు, దుత్తలూరు, కలిగిరి, జలదంకి, దగదర్తి, అల్లూరు, బోగోలు, కావలి
➤ఆత్మకూరు(9): కలువాయి, చేజర్ల, సంగం, ఆత్మకూరు, అనంతసాగరం, మర్రిపాడు, ASపేట, ఉదయగిరి, సీతారామపురం
➤గూడూరు(3): కోట, చిల్లకూరు, గూడూరు
News December 30, 2025
కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్

AP: లైఫ్ ట్యాక్స్ వర్తించే వాహనాలపై ఆ పన్నులో 10% చొప్పున “రోడ్ సేఫ్టీ సెస్” వసూలు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఆ మొత్తాన్ని రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు బదిలీ చేసి రోడ్ల మెరుగుదల, భద్రతా చర్యలకు వినియోగిస్తామని పేర్కొంది. ఈ సెస్ ద్వారా సంవత్సరానికి రూ.270 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది. GST తగ్గింపుతో వాహనాల రేట్లు తగ్గాయని, వాహనదారులకు ఈ సెస్ భారం కాబోదని తెలిపింది.
News December 30, 2025
MBNR: 200 ఉద్యోగాలు.. నేడే చివరి అవకాశం.!

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. 3 ప్రైవేట్ సంస్థలు 200 ఉద్యోగాలు ఉన్నాయని దరఖాస్తులను స్వీకరిస్తున్నామని ఉపాధి కల్పనా అధికారి మైత్రి ప్రియ తెలిపారు. ఈరోజు ఉ.10.30 నుంచి 2 గంటల వరకు మాత్రమే అవకాశం ఉందన్నారు. జిల్లా ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోమన్నారు. రూ.10 నుంచి 20 వేల వేతనాలు ఉంటాయన్నారు. 9948568830, 8919380410 సంప్రదించాలన్నారు.


