News March 10, 2025
లలిత్ మోదీకి బిగ్ షాక్

IPL మాజీ ఛైర్మన్ లలిత్ మోదీకి <<15692963>>వనువాటు<<>> ప్రభుత్వం షాకిచ్చింది. ఆయనకు జారీ చేసిన పాస్పోర్ట్ను రద్దు చేయాలని ఆ దేశ ప్రధాని జోతం నపట్ పౌరసత్వ కమిషన్ను ఆదేశించారు. కొన్ని వారాల క్రితం లలిత్ మోదీ వనువాటు పౌరసత్వాన్ని పొందిన సంగతి తెలిసిందే. మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన, భారత్లో దర్యాప్తును తప్పించుకునేందుకు అక్కడి పౌరసత్వాన్ని పొందారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
Similar News
News March 12, 2026
కిడ్నీలను కాపాడుకుందామా!

నేడు ప్రపంచ మూత్రపిండాల దినోత్సవం. కిడ్నీ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే రోజూ కనీసం 3-4 లీటర్ల నీరు తాగాలి. ఆహారంలో ఉప్పు, చక్కెర తగ్గించాలి. బీపీ, షుగర్ను నియంత్రణలో ఉంచుకోవాలి. సొంత వైద్యంతో పెయిన్ కిల్లర్స్ వాడటం ప్రమాదకరం. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుంటే కిడ్నీలను కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. SHARE IT
News March 12, 2026
సంజూకు జట్టే ముఖ్యం.. సెంచరీలు కాదు: సూర్య

T20WCలో అదరగొట్టిన సంజూ శాంసన్పై కెప్టెన్ సూర్య ప్రశంసలు కురిపించారు. ‘చివరి 3 మ్యాచుల్లో ఆయన 97*, 89, 89 స్కోర్లు చేశారు. కావాలనుకుంటే వాటిని సెంచరీలుగా మలిచేవారు. కానీ 89 నుంచి 100కు చేరడానికి 10 బంతులను తీసుకుంటే నాన్ స్ట్రైకర్ నుంచి 6 బాల్స్ను లాగేసుకున్నట్లే. సంజూకు సెంచరీల కంటే జట్టు ప్రయోజనాలే ముఖ్యం. ఆయన అలా ఆడారు కాబట్టే దూబే 6 బంతుల్లో 28 రన్స్ కొట్టారు’ అని పేర్కొన్నారు.
News March 12, 2026
మనుషులూ 200 ఏళ్లు బతకొచ్చు!

భూమిపై ఎక్కువకాలం బతికే జీవుల్లో తిమింగలం ఒకటి. అందులోనూ Bowhead రకం 200 ఏళ్లు జీవిస్తుంది. దీని దీర్ఘాయువుకు క్యాన్సర్, ఇతర వ్యాధుల నియంత్రణకు DNA రిపేర్ ప్రొటీన్గా పిలిచే CIRBP కారణమని రోచెస్టర్ వర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీన్ని మానవ కణాలు, కొన్ని రకాల ఈగల్లో ప్రవేశపెట్టగా DNA రిపేర్ సాధ్యమైంది. ఈగలు ఎక్కువ కాలం జీవించాయి కూడా. మానవుల్లోనూ సక్సెస్ అయితే 200Y బతకడం సాధ్యమేనంటున్నారు.


