News March 23, 2024

గజ్వేల్: వాహన తనిఖీల్లో రూ.50 లక్షల పట్టివేత

image

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో విస్తృతంగా వాహన తనిఖీలు కొనసాగుతున్నాయి. గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అంబేద్కర్ చౌరస్తా వద్ద వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులకు రూ.50 లక్షలు పట్టుకున్నట్లు తెలిపారు. గజ్వేల్ సీఐ సైదా, అడిషనల్ ముత్యంరాజు, సిబ్బంది ప్రత్యేక బలగాలతో ఈ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ కారులో పెద్ద మొత్తంలో నగదు లభించగా సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News September 8, 2025

మెదక్: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్

image

పాపన్నపేట మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పాటించవలసిన జాగ్రత్తలను ప్రజలకు వివరించాలని తెలిపారు.

News September 7, 2025

మెదక్: ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనం: ఎస్పీ

image

మెదక్ జిల్లా వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవం ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిశాయని ఎస్పీ డీవీ.శ్రీనివాస రావు తెలిపారు. 11 రోజుల పాటు జిల్లా అంతటా పోలీస్ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో 24 గంటలు అప్రమత్తంగా పనిచేయడంతో అన్ని మండలాలు, గ్రామాలు, పట్టణాల్లో వినాయక ఉత్సవాలు సజావుగా జరిగాయని పేర్కొన్నారు. ఈ సందర్బంగా సిబ్బందిని అభినందించారు.

News September 7, 2025

మెదక్: రేపు పోలింగ్ కేంద్రాలు, ఓటర్ జాబితాపై సమావేశం

image

మెదక్ జిల్లాలో పోలింగ్ కేంద్రాలు, ఓటర్ జాబితా ప్రచురణ, సంబంధించిన అంశాలపై సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సమీకృత కలెక్టరేట్‌లో కలెక్టర్ అధ్యక్షతన వివిధ రాజకీయ పార్టీ నాయకులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసినట్లు జడ్పీ సీఈఓ ఎల్లయ్య తెలిపారు. వివిధ ‌రాజకీయ పార్టీ ప్రతినిధులందరూ ఈ సమావేశానికి సకాలంలో తప్పక హాజరుకావాలని సూచించారు.