News March 10, 2025

తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశం

image

తెలంగాణ భవన్‌లో ఈరోజు ఉదయం 10 గంటలకు బీఆర్ఎస్ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర రాజకీయాలు, BRS కార్యక్రమాలు, బీఆర్ఎస్ ఆవశ్యకతపై వివరణాత్మకంగా మాట్లాడనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పెరేడ్ గ్రౌండ్ సమావేశంలో మహిళా సంఘాలకు, అభివృద్ధి ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని చెప్పిన మాటలకు పూర్తి వివరాలతో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.

Similar News

News March 10, 2025

సీఐడీ చేతికి ఫాల్కన్ ఇన్వెస్టింగ్ కేసు!

image

తెలంగాణ సీఐడీ చేతికి ఫాల్కన్ కేసు వెళ్లనుంది. ఇప్పటివరకు 19 మంది నిందితుల్లో ముగ్గురు అరెస్ట్ కాగా కోట్లాది రూపాయలు వసూలు చేసిన ఫాల్కన్ కేసును సీఐడీ బదిలీకి సైబరాబాద్ పోలీసుల నిర్ణయం తీసుకున్నారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో 3 కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణతో పాటు ఢిల్లీ, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్రలో వేల సంఖ్యలో బాధితులున్నారు. సైబరాబాద్ పోలీసులు సీఐడీకి అప్పజెప్పే అవకాశం కనబడుతోంది.

News March 10, 2025

HYD: సీఎంని కలిసిన అద్దంకి దంపతులు

image

సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ దంపతులు కలిశారు. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎంని కలిసి.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను కాంగ్రెస్ ప్రకటించడంతో సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎంకు శాలువ కప్పి పుష్పగుచ్ఛం అందించారు.

News March 10, 2025

HYD: సీఎం రేవంత్ దిగజారుస్తున్నారు: కవిత

image

చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి తెలంగాణ ప్రతిష్ఠను సీఎం రేవంత్ రెడ్డి దిగజారుస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ ఉన్నతంగా ఉందని ఇన్వెస్టర్లను ఆహ్వానిస్తే.. ఢిల్లీ వేదికగా రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర పరిస్థితి బాగోలేదని అబద్ధాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

error: Content is protected !!