News March 10, 2025

బెల్లంపల్లి: ‘చిన్నారుల చికిత్సకు రూ.32కోట్లు కావాలి’

image

తమ పిల్లలను కాపాడాలని ఓ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. బెల్లంపల్లికి చెందిన కృష్ణవేణి-కళ్యాణ్ దాస్ దంపతుల కుమార్తె సహస్ర(1), కుమారుడు మహావీర్(4)లు స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫి (SMA) వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో వారికి ఒక్కొక్కరికి రూ.16కోట్ల ఇంజెక్షన్ వేయాలని డాక్టర్లు తెలిపారు. చికిత్స చేయించేందుకు తమ ఆర్థిక స్తోమత సరిపోదని.. ప్రభుత్వం, అధికారులు ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

Similar News

News March 10, 2025

సిరిసిల్ల: ప్రజావాణిలో 153 దరఖాస్తుల స్వీకరణ

image

ప్రజావాణిలో వచ్చే సమస్యలను పరిష్కరిస్తున్నామని కలెక్టర్ సందీప్ కుమార్‌ఝా తెలిపారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించి కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చే అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. పెండింగ్లో పెట్టవద్దని అధికారులకు స్పష్టం చేశారు. మొత్తం 153 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.

News March 10, 2025

అనకాపల్లి: ప్రజా వేదికలో 440 అర్జీలు

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తమ దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వాటిని పరిశీలించిన ఆమె సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులకు పంపించారు. మొత్తం 440 అర్జీలు వచ్చినట్లు తెలిపారు.

News March 10, 2025

సిరిసిల్ల: అట్రాసిటీ కేసుల పరిహారం పంపిణీ: కలెక్టర్

image

ఎస్సీ, ఎస్టీలకు అట్రాసిటీ కేసుల పరిహారం పంపిణీ చేసినట్టు సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్‌ఝా తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. మొత్తం సిరిసిల్ల జిల్లాలోని 46 మంది బాధితులకు రూ 36,87,500 లను వారి వారి బ్యాంకు ఖాతాలో జమ చేసినట్టు ఆయన స్పష్టం చేశారు.

error: Content is protected !!