News March 10, 2025
మిర్యాలగూడ: ప్రణయ్ హత్య కేసు.. JUSTICE SERVED

ఆరేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన <<15709750>>ప్రణయ్ హత్య<<>> కేసుకు ఎట్టకేలకు తెరపడింది. ఈరోజు NLG కోర్టు ప్రధాన నిందితుడికి ఉరిశిక్ష, మిగతా వారికి యావజ్జీవ శిక్ష విధించింది. ప్రణయ్, అమృత పరిచయం నుంచి వారి ప్రేమ పెళ్లి.. గొడవలు.. కేసులు.. ప్రణయ్ హత్య.. మారుతీరావు సూసైడ్.. వాదనలు.. విచారణలు.. నేటి కోర్టు తీర్పు వరకు ప్రతి సందర్భం చర్చనీయాంశం అవగా ఫైనల్గా JUSTICE SERVED అని పలువురు అంటున్నారు.
Similar News
News March 5, 2026
శ్రీకాకుళంలో మర్డర్.. నిందితుడి అరెస్టు

శ్రీకాకుళంలోని వెంకన్నగారిపేట మామిడితోట వద్ద గత నెల 26న <<19247482>>హత్య<<>> జరిగిన విషయం తెలిసిందే. DSP వివరాల మేరకు.. వాంబేకాలనీకి చెందిన మోహన్ రావు(40) హిజ్రాల నాయకుడు. అతనికి హయతీనగరానికి చెందిన ఢిల్లీశ్వరరావు(21)తో శారీరక సంబంధం ఏర్పడింది. బైక్ EMI కోసం రూ.10వేలు కావాలని మోహన్ను ఢిల్లీ అడగ్గా ఇవ్వలేదు. దీంతో వాళ్ల మధ్య గొడవలు పెరిగాయి. మోహన్ రావుపై కక్ష పెట్టుకుని ఢిల్లీ హత్య చేశాడని పోలీసులు తెలిపారు.
News March 5, 2026
తిరుపతి: టెన్త్ విద్యార్థులకు ALERT..

జిల్లాలో 179 పరీక్షా కేంద్రాల్లో 16 నుంచి ఏప్రిల్ 1 వరకు టెన్త్ పరీక్షలు జరగనున్నట్లు DEO కుమార్ తెలిపారు. 29,165 మంది పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9.30 నుంచి 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని, నిమిషం ఆలస్యమైన అనుమతి ఉండదని స్పష్టం చేశారు. పరీక్షల కోసం 10 ఫ్లైయింగ్, 30 సిట్టింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశామన్నారు.
News March 5, 2026
‘అస్థిర’ నేపాల్: 17 ఏళ్లలో 14 ప్రభుత్వాలు..

నేపాల్లో 2008లో రాచరిక పాలన అంతమయ్యాక ప్రచండ(నేపాలీ కమ్యూనిస్ట్ పార్టీ-మావోయిస్ట్) అధికారాన్ని చేపట్టారు. అయితే ఏడాదికే ప్రభుత్వం కుప్పకూలింది. ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్-మార్కిస్ట్, నేపాలీ కాంగ్రెస్ నేతలు PM పీఠం చేపట్టారు. అవినీతి, పార్టీలకు మెజార్టీ లేకపోవడంతో 17 ఏళ్లలో 14 ప్రభుత్వాలు మారాయి. కేపీ ఓలీ సర్కార్ కూలిన తర్వాత ఇవాళ ఎన్నికలు జరిగాయి. విజేత ఎవరో రేపు <<19301003>>తేలనుంది.<<>>


