News March 10, 2025
భీమిలి: గుండెపోటుతో టీచర్ మృతి

భీమిలి జూనియర్ కాలేజీలో ఇంటర్ ఇన్విజిలేటర్ గా ఉన్న డి.మాధవరావు(55) పరీక్షా కేంద్రంలోనే గుండెపోటుతో మృతి చెందాడు. రేకవానిపాలెం ఎంపీపీ పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్న ఆయనకు ఇంటర్ ఇన్విజిలేషన్ విధులు అప్పగించారు. ఈమేరకు సోమవారం ఉ.8గంటలకు పరీక్షా కేంద్రంలో ఆయన కుప్పకూలిపోయాడు. సహచరులు వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Similar News
News March 18, 2026
జీవీఎంసీలో కలెక్టర్ పాలన.. అధికారుల్లో గుబులు

జీవీఎంసీ పాలకవర్గం పదవీకాలం ముగియడంతో కార్పొరేషన్ నేటి నుంచి ప్రత్యేక అధికారి పాలనలోకి వెళ్లింది. కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆధ్వర్యంలో పరిపాలన సాగనుంది. టౌన్ ప్లానింగ్ విభాగంపై ఎక్కువ ఫిర్యాదులు రావడంతో కలెక్టర్ గతంలోనే అసంతృప్తి వ్యక్తం చేశారు. హెచ్చరికలు, మెమోలు ఇచ్చినా మార్పు లేదు. ప్రస్తుతం ఆయన పాలనాపగ్గాలు చేపట్టడంతో వారిలో ఆందోళన పెరిగింది. ఇటీవల పలు జోన్లలో ఏసీబీ తనిఖీలు జరగడం గమనార్హం.
News March 18, 2026
విశాఖ: గంజాయి పట్టివేత.. కానిస్టేబుళ్ల అరెస్ట్

గంజాయి తరలిస్తున్న ఐదుగురిని విశాఖ టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. వీరిలో VZM జిల్లాకు చెందిన కానిస్టేబుళ్లు ఉండడం గమనార్హం. కారులో 10 కేజీల గంజాయి తరలిస్తుండగా భీమిలి పరిధి దాకమర్రికి సమీపంలో వీరిని అరెస్ట్ చేశామన్నారు. కానిస్టేబుళ్లు శివప్రసాద్(ఎస్. కోట), వి.రాంబాబు (వేపాడ), ఇ.సతీశ్(కొత్తవలస) స్టేషన్లకు చెందిన వారిగా మిగిలిన వారిని పి.శివకృష్ట, జి.గోపిగా గుర్తించారు.
News March 18, 2026
విశాఖ: ఆస్తి పన్ను వడ్డీపై 50% రాయితీ

జీవీఎంసీకి బకాయి ఉన్న ఆస్తి పన్ను పూర్తిగా చెల్లిస్తే వడ్డీపై 50% రాయితీ పొందవచ్చు అని జీవీఎంసీ కమిషనర్ తెలిపారు. నగరవ్యాప్తంగా రూ.1200 కోట్లు వసూలు అవుతున్నప్పటికీ స్థానికేతర గృహ బకాయిలు ఉండిపోతున్నాయని పేర్కొన్నారు. వీటిని వసూలు చేసేందుకు జీవీఎంసీ ప్రత్యేక ఆఫర్ను ప్రకటించిందని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు.


