News March 10, 2025
మిర్యాలగూడ: కోర్టు తీర్పు.. పేరెంట్స్, అమృత భావోద్వేగం

మిర్యాలగూడ <<15710555>>ప్రణయ్ హత్య<<>> కేసులో కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఇప్పటికే మారుతీరావు ఆత్మహత్య చేసుకోగా A2 సుభాష్ శర్మకు ఉరిశిక్ష, A3 అజ్గర్ అలీ, A4 అబ్దుల్లా బారీ, A5 కరీం, A6 శ్రావణ్, A7 శివ, A8 నిజాంకు యావజ్జీవ శిక్షను కోర్టు విధించింది. కాగా తీర్పు అనంతరం మిర్యాలగూడలోని ప్రణయ్ సమాధి వద్ద పూలు వేసి పలువురు నివాళులర్పించారు. కాగా ప్రణయ్ తల్లిదండ్రులు, భార్య అమృత కన్నీటి పర్యంతమయ్యారు.
Similar News
News March 16, 2026
ఆస్కార్-2026 చిత్రాలు ఏ OTTలో ఉన్నాయంటే?

* వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్- జియో హాట్స్టార్
* సిన్నర్స్- జియో హాట్స్టార్
* ఫ్రాంకెన్స్టైన్- నెట్ఫ్లిక్స్
* కెపాప్ డీమన్ హంటర్స్- నెట్ఫ్లిక్స్
* వెపన్స్- జియో హాట్స్టార్
* F1- ప్రైమ్ వీడియో(రెంట్), ఆపిల్ టీవీ
News March 16, 2026
MHBD: ఉపాధ్యాయులకు డీఈవో సూచనలు

మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్ ఉపాధ్యాయులకు పలు ఆదేశాలు జారీ చేశారు. టెన్త్ పరీక్షలు లేని రోజు సి.ఎస్, డి.ఓ, ఇన్విజిలేటర్ అందరూ తమ పాఠశాలలో హాజరు కావాలని ఆదేశించారు. FA 4, ఎండ్ లైన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్, పెండింగ్ లేకుండా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. ఎంఈఓ, కాంప్లెక్స్ హెచ్ఎంలు ఉపాధ్యాయులకు నిబంధనలను తెలియజేయాలని సూచించారు.
News March 16, 2026
కరీంనగర్ ప్రాజెక్టులకు బడ్జెట్ మోక్షం కలిగేనా..?

కరీంనగర్ నగరానికి మణిహారాలైన కేబుల్ బ్రిడ్జి అనుబంధ పనులు, మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులపై ఈ అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టత వస్తుందని జిల్లా వాసులు ఆశిస్తున్నారు. అటు కరీంనగర్-వీణవకం రహదారి విస్తరణ, మరమ్మతులు, కల్వల ప్రాజెక్టు ఆధునీకరణ పనులకు కూడా ఈ బడ్జెట్లోనైనా ప్రాధాన్యత దక్కుతుందో లేదోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం నిధులు కేటాయించి పనులను వేగవంతం చేయాలని కోరుతున్నారు.


