News March 10, 2025
50-30-20 రూల్ పాటిస్తున్నారా?

సంపాదించిన డబ్బును ఎలా ఉపయోగించాలో తెలిసినవాడు గొప్పవాడు అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. జీతంలో 50% ఇంటి అవసరాలు, హెల్త్ కేర్, రవాణా, పర్సనల్ కేర్, నిత్యావసర వస్తువుల కోసం ఖర్చు చేయాలి. మరో 30% షాపింగ్స్, ఔటింగ్స్ వంటి కోరికల కోసం ఉంచుకోండి. మిగతా 20శాతం మాత్రం పొదుపు చేయాలి. ప్రతి నెలా డబ్బును పొదుపు చేస్తూ భవిష్యత్తు కోసం పెట్టుబడులు ప్రారంభించండి. ఎమర్జెన్సీ ఫండ్ మెయింటేన్ చేయండి. SHARE IT
Similar News
News March 10, 2025
ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయాలని రామ్మోహన్ లేఖ

AP: శ్రీకాకుళం జిల్లాలో ఫిషింగ్ హార్బర్, రెండు ఫిషింగ్ జెట్టీలు ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి శర్బానంద సోనోవాల్కు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు లేఖ రాశారు. తన నియోజకవర్గం శ్రీకాకుళంలో 197కి.మీ సముద్ర తీర ప్రాంతం ఉందని, 230కి పైగా గ్రామాల ప్రజలు మత్స్య సంపదపైనే ఆధారపడి ఉన్నారని వివరించారు. సంతబొమ్మాళి(మ) భావనపాడు గ్రామం వద్ద ఫిషింగ్ పోర్ట్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
News March 10, 2025
అస్సాంకు సొంత ఉపగ్రహం

త్వరలో ‘అస్సాంశాట్’ అనే సొంత ఉపగ్రహాన్ని లాంఛ్ చేయనున్నట్లు అస్సాం ఆర్థిక మంత్రి అజంతా నియోగ్ ప్రకటించారు. సరిహద్దులపై నిఘాకు, కీలక సామాజిక-ఆర్థిక ప్రాజెక్టులపై సమాచారం కోసం ఈ శాటిలైట్ను వాడనున్నట్లు పేర్కొన్నారు. మౌలిక వసతుల అభివృద్ధి, విపత్తు నిర్వహణ, వ్యవసాయానికి కూడా అది ఉపకరిస్తుందని వివరించారు. ప్రయోగం పూర్తైతే సొంత శాటిలైట్ ఉన్న తొలి రాష్ట్రంగా అస్సాం నిలవనుంది.
News March 10, 2025
రామగుండం ఎయిర్పోర్ట్ సాధ్యం కాదు: కేంద్రం

TG: పెద్దపల్లి(D) రామగుండంలో ఎయిర్పోర్టు ఏర్పాటు చేయాలని స్థానిక MP గడ్డం వంశీ చేసిన ప్రతిపాదనలపై కేంద్రం స్పందించింది. ‘ఇక్కడ ఎయిర్పోర్టు ఏర్పాటు సాధ్యం కాదు. చుట్టూ కొండలు, ఎయిర్స్పేస్పై IAF ఆంక్షలు ఉన్నాయి. ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదు. ఒక వేళ ప్రభుత్వం నుంచి వస్తే పరిశీలిస్తాం’ అని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు MPకి రిప్లై ఇచ్చారు.