News March 10, 2025

ఏలూరు: వారం వ్యవధిలో రెండు ప్రమాదాలు

image

ఏలూరు జిల్లాలో వారం రోజుల వ్యవధిలో రెండు ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల ప్రమాదాలకు గురయ్యారు. వైజాగ్, హైదరాబాద్, చెన్నై తదితర సర్వీసులకు ఏలూరు సెంటర్ పాయింట్‌గా ఉంది. సుదూర ప్రాంతాలకు ట్రావెల్ చేసే ఈ బస్సుల్లో డ్రైవర్లు ఒక్కరే ఉంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏకధాటిగా గంటల తరబడి డ్రైవింగ్ చేయడం, నిద్రలేమి కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Similar News

News March 10, 2025

ఆ సినిమా చూడలేక మధ్యలోనే వెళ్లిపోయాం: కిరణ్ అబ్బవరం

image

మార్కో సినిమాలో హింసను భరించలేకపోయామని యువ నటుడు కిరణ్ అబ్బవరం ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘నా భార్యతో కలిసి ఆ సినిమాకు వెళ్లాను. తను గర్భంతో ఉంది. సెకండ్ హాఫ్ సమయానికి చూడలేకపోయాం. ఆమె చాలా అసౌకర్యాన్ని ఫీలైంది. దీంతో ఇంకా చాలా సినిమా ఉండగానే బయటికొచ్చేశాం’ అని పేర్కొన్నారు. మలయాళ చరిత్రలో అత్యంత హింసాత్మక సినిమాగా పేరొందిన మార్కోకు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రావడం గమనార్హం.

News March 10, 2025

ఖమ్మం: లోక్‌సభలో ఎంపీ రఘురామ అభ్యర్థన 

image

377 నిబంధన కింద తెలంగాణలో ఆయిల్ పామ్ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఖమ్మం ఎంపీరఘురాం రెడ్డి సోమవారం లోక్‌సభలో కోరారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తృతంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపడుతోందన్నారు. ఆయిల్ పామ్ ఉత్పత్తిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా మార్చడం, జాతీయ ఆహార చమురు సరఫరాలో గణనీయంగా దోహదపడతామన్నారు.

News March 10, 2025

విశాఖలో ‘హయగ్రీవ’ భూములు వెనక్కి

image

AP: విశాఖలో హయగ్రీవ ఫార్మ్ అండ్ డెవలపర్స్‌కు ఇచ్చిన 12.41 ఎకరాల భూ కేటాయింపును ప్రభుత్వం రద్దు చేసింది. నిబంధనలు ఉల్లంఘించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుపుతూ సీసీఎల్ఏ ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే భూమిని స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించింది. అటు అమరావతిలోనూ 13 సంస్థల భూ కేటాయింపులను రద్దు చేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ <<15713685>>నిర్ణయించిన<<>> విషయం తెలిసిందే.

error: Content is protected !!