News March 10, 2025

జగిత్యాల ప్రజావాణిలో 50 ఫిర్యాదులు

image

జగిత్యాల కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 50 ఫిర్యాదులు వచ్చినట్లు కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపించి సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్‌లో లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ బిఎస్. లత, ఆర్డీవోలు మధుసూదన్, జివాకర్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

Similar News

News March 11, 2025

సంగారెడ్డి: జిల్లా కలెక్టర్‌ను కలిసిన నూతన ఎస్పీ

image

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతిని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నూతన ఎస్పీ పారితోష్ పంకజ్ సోమవారం కలిశారు. ఎస్పీగా బదిలీపై వచ్చిన పారితోష్ పంకజ్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక్కడ ఎస్పీగా పని చేసిన చెన్నూరి రూపేష్ హైదరాబాదులోని యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా బదిలీపై వెళ్లారు.

News March 10, 2025

కదిరి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్

image

AP: శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం వేదపండితులు ఆయనకు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌తో పాటు పలువురు టీడీపీ నేతలు లోకేశ్ వెంట ఉన్నారు. ఈ నెల 9న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 15 రోజులపాటు అంగరంగ వైభవంగా సాగనున్నాయి.

News March 10, 2025

సంగారెడ్డి: న్యాయమూర్తిని కలిసిన నూతన ఎస్పీ

image

సంగారెడ్డి జిల్లా నూతన ఎస్పీగా పారితోష్ పంకజ్ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మర్యాదపూర్వకంగా జిల్లా న్యాయమూర్తి భవాని చంద్రను ఎస్పీ కలిశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఎస్పీకి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు.

error: Content is protected !!