News March 10, 2025
బాపట్ల పీజీఆర్ఎస్కు 89 అర్జీలు

బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో 89 అర్జీలు అందినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఫిర్యాదులను చట్టపరిధిలో వేగంగా పరిష్కరించాలన్నారు. ప్రతి సోమవారం జరిగే కార్యక్రమంలో ప్రజలు స్వయంగా వచ్చి తమ సమస్యలను అర్జీల రూపంలో అందించవచ్చని జిల్లా ఎస్పీ తెలిపారు.
Similar News
News March 10, 2025
రేపు ములుగు జిల్లాలో గవర్నర్ పర్యటన

TG: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రేపు ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. తాడ్వాయి మండలంలోని కొండపర్తి గ్రామాన్ని దత్తత తీసుకున్న క్రమంలో ఆ గ్రామ ప్రజలతో ఆయన భేటీ కానున్నారు. గ్రామానికి ఎలాంటి సౌకర్యాలు కావాలి? ఇంకా ఏం చేయాలి? అభివృద్ధి సహా ఇతర సదుపాయాలపై వారితో చర్చిస్తారు. అనంతరం మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకోనున్నారు.
News March 10, 2025
రేపు ఈ ప్రాంతాల వారు జాగ్రత్త

AP: రేపు రాష్ట్ర వ్యాప్తంగా పలు మండలాల్లో తీవ్ర వడగాల్పులు ఉంటాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అల్లూరి(D) కూనవరం, వరరామచంద్రపురం, వేలేర్పాడు, మన్యం(D) పాలకొండ, సీతంపేట, లక్ష్మీనర్సుపేట, బూర్జ, హీరా మండలంలో తీవ్ర వడగాలులు వీస్తాయంది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా 62 మండలాల్లో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఇక్కడ <
News March 10, 2025
ప్రభాస్-ప్రశాంత్ సినిమా టైటిల్ ఇదేనా?

రెబల్ స్టార్ ప్రభాస్తో ప్రశాంత్ వర్మ ఓ సినిమాను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. దానిపై ఓ ఇంట్రస్టింగ్ అప్డేట్ టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. మూవీ స్టోరీ మహాభారతంలోని బకాసురుడి గురించి ఉంటుందని టాక్. ఆ పేరు మీదే ‘బకా’ అనే టైటిల్ను పెట్టాలని ప్రశాంత్ భావిస్తున్నారని సమాచారం. బకాసురుడిని భీముడు చంపాడు. మరి ప్రభాస్ భీముడి పాత్రను పోషిస్తారా లేక ఇది వేరే ఏదైనా కథనా అన్నది ఆసక్తికరంగా మారింది.