News March 10, 2025
Rs 49000 కోట్లు: APతో టాటాపవర్ MOU

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో టాటా పవర్ సబ్సిడరీ కంపెనీ టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో 7000 MW సామర్థ్యంతో సోలార్, విండ్, హైబ్రీడ్ సహా పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను అభివృద్ధి చేయనుంది. పరిస్థితులను బట్టి స్టోరేజ్ సొల్యూషన్స్ నిర్మిస్తుందని తెలిసింది. ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.49000 కోట్ల పెట్టుబడి అవసరం అవుతుందని అంచనా. ఎక్కడ నిర్మిస్తారో తెలియాల్సి ఉంది.
Similar News
News March 11, 2025
ఘోరం: పిల్లల్ని చంపి దంపతుల ఆత్మహత్య

TG: హైదరాబాద్లోని హబ్సిగూడలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లల్ని చంపి దంపతులు చంద్రశేఖర్(40), కవిత(35) ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆర్థిక ఇబ్బందులే కారణమని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
News March 11, 2025
బండి సంజయ్ జోక్యంతో భారతీయులకు విముక్తి

థాయ్లాండ్లో బందీలుగా మారిన 540 మంది భారతీయులకు విముక్తి లభించింది. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో 540 మందిని సైబర్ నేరగాళ్లు బందీలుగా చేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. కేంద్రమంత్రి బండి సంజయ్ జోక్యంతో బాధితులకు విముక్తి లభించగా, ప్రత్యేక విమానంలో వారంతా భారత్కు చేరుకున్నారు. బాధితుల్లో ఏపీ, తెలంగాణకు చెందిన యువత అధికంగా ఉన్నారు.
News March 11, 2025
విధ్వంసం.. 47 బంతుల్లో సెంచరీ

ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీ20లో సెంచరీల మోత మోగుతోంది. తాజాగా ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో శ్రీలంక బ్యాటర్ సంగక్కర శతకం బాదారు. అతడు 47 బంతుల్లోనే 106 రన్స్తో నాటౌట్గా నిలిచారు. ఇందులో 19 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. సంగక్కర విధ్వంసంతో 147 రన్స్ టార్గెట్ను లంక 12.5 బంతుల్లోనే ఛేదించింది. కాగా ఈ టోర్నీలో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ వాట్సన్ మూడు శతకాలు బాదిన విషయం తెలిసిందే.