News March 10, 2025

ఖమ్మం జిల్లాలో రేపు మంత్రి పొంగులేటి పర్యటన

image

వైరా, నేలకొండపల్లి మండలాల్లో మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించనున్నట్లు మంత్రి పీఏ రాఘవ ఓ ప్రకటనలో తెలిపారు. ముందుగా మంత్రి వైరా (M) పుణ్యాపురంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని చెప్పారు. అనంతరం నేలకొండపల్లి (M) మేడేపల్లి, అనసాగరం, సదాశివాపురం, నాచేపల్లి, చెర్వుమాదారం, అమ్మగూడెం, రాజేశ్వరపురం తదితర గ్రామాల్లో పర్యటించి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారన్నారు.

Similar News

News March 8, 2026

ఖమ్మం: ఈ మహిళా సర్పంచ్ గ్రేట్ కదా..!

image

అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ నాయకన్ గూడెం సర్పంచ్ కంచరి సైదమ్మ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. భర్త ఆటో నడుపుతూ, టైర్ల షాపు నిర్వహిస్తుండగా.. ఆమె ఖాళీ సమయాల్లో ఆయనకు చేదోడుగా ఉంటూ పంచర్లు వేసేవారు. సర్పంచ్‌గా ఎన్నికైన తర్వాత కూడా ఆమె తన పనిని వదలకుండా, ఒకపక్క గ్రామ అభివృద్ధి పనులు చూస్తూనే.. మరోపక్క కష్టాన్ని నమ్ముకుని శ్రమిస్తున్నారు. ఆమె అంకితభావం మహిళలకు స్ఫూర్తినిస్తోంది.

News March 8, 2026

ఖమ్మం: సుపారీ గ్యాంగ్ సంచారం కలకలం..!

image

బోనకల్ మండలం గోవిందాపురం (ఎల్)లో సుపారీ గ్యాంగ్ సంచారం వార్తలు కలకలం రేపాయి. గ్రామంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని గ్రామస్థులు రెండు గంటల పాటు శ్రమించి పట్టుకున్నారు. నిందితుడు బిహార్‌కు చెందినవాడిగా గుర్తించగా, తమతో పాటు మరో ఐదుగురు వచ్చినట్లు ప్రాథమిక విచారణలో తెలిపాడు. ఈ ఘటనతో భయాందోళనలో ఉన్న గ్రామస్థులు, వెంటనే పోలీసులు స్పందించి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

News March 8, 2026

ఖమ్మం: భారీగా యూరియా రాక

image

చింతకాని మండలం పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు శనివారం 2,670.84 మెట్రిక్ టన్నుల ఇఫ్కో యూరియా చేరుకుంది. ఇందులో ఖమ్మం జిల్లాకు 1,070.84 టన్నులు, భద్రాద్రికి 500, మహబూబాబాద్‌కు 900, ఖమ్మం సీఆర్పీకి 200 టన్నుల యూరియా కేటాయించినట్లు టెక్నికల్ ఏవో పవన్ కుమార్ తెలిపారు. రైతులకు ఎరువుల కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.