News March 10, 2025
SKLM: పరిశ్రమల స్థాపనతోనే ఆర్థిక ప్రగతి-కలెక్టర్

పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని అనుమతులను సత్వరమే మంజూరు చేసి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశం జూమ్ ద్వారా సోమవారం జరిగింది. ఈ సమావేశంలో పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై కలెక్టర్ జిల్లాలోని ఆయా ఉన్నతాధికారులతో కలిసి చర్చించారు.
Similar News
News April 6, 2026
మందస: తల్లీ, చెల్లికి ఒకేసారి తలకొరివి పెట్టిన యువతి

మందస మండలం పెద్ద కేసుపురంలో ఆదివారం పిడుగుపాటుకు గురై తల్లీ, కుమార్తె మృతి చెందిన విషయం తెలిసిందే. గత ఐదు నెలల క్రితం తండ్రి మృతి చెందడంతో తల్లీ కృష్ణ కుమారి(38), చెల్లి యోగేశ్వరి(15)తో కలిసి నికిత(18) జీవనం సాగిస్తోంది. పిడుగు రూపంలో అమ్మ, చెల్లి మృతి చెందడంతో..ఒంటరిగా మిగిలిన నికిత సోమవారం ఇరువురికి తలకొరివి పెట్టింది. ఈ ఘటన చూసిన గ్రామస్థుల కళ్లు చెమ్మగిల్లాయి.
News April 6, 2026
శ్రీకాకుళం జిల్లా ప్రజలకు అలర్ట్..!

శ్రీకాకుళం జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాలలో సోమ, మంగళవారాలలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. విభిన్న వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. వర్షాలు పడేటప్పుడు ప్రజలు బయట తిరగకూడదని సూచించారు.
News April 6, 2026
SKLM: 11 మంది పిల్లలపై పిచ్చి కుక్క దాడి

పొందూరులో పిచ్చికుక్క రెండు రోజుల్లో వీరంగం సృష్టించింది. మండల కేంద్రంలోని నాయుడువీధి, గాంధీనగర్, మార్కెట్ లైన్, కనకాల వీధిలలో 15 ఏళ్ల లోపు 11 మంది పిల్లలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. బాధితులను శ్రీకాకుళం RIMSకు తరలించారు. మిగతా వారికి పొందూరు సామాజిక హాస్పిటల్లో వైద్యం అందిస్తున్నారు. కుక్కల నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజులు కోరుతున్నారు.


