News March 10, 2025

ఉద్యోగులు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి: కలెక్టర్

image

ఐగాట్ కర్మయోగి ద్వారా ఉద్యోగులు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని నంద్యాల కలెక్టర్ జి.రాజకుమారి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా ఐగాట్ కర్మయోగి యాప్, పి4 సర్వేలపై జిల్లా అధికారులకు దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, డిఆర్ రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Similar News

News March 12, 2026

అనంతపురం జిల్లాలో 2,75,642 మంది రైతులు అర్హులు

image

అనంతపురం జిల్లా వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పథకం కింద 2,75,642 మంది రైతుల అర్హుల జాబితాను అధికారులు ప్రకటించారు. జిల్లాకు రూ.163.26 కోట్లు కేటాయించగా అందులో అన్నదాత సుఖీభవ పథకానికి రూ.110.26 కోట్లు, పీఎం కిసాన్‌కు రూ.53.01 కోట్లు విడుదల చేయనున్నారు. జిల్లాలో అత్యధికంగా శింగనమల నియోజకవర్గంలో 54,338 రైతులకు అందించనున్నారు.

News March 12, 2026

ప్రభుత్వ ఆఫీసుల్లో సర్టిఫికెట్లు అడగొద్దు: CM

image

AP: ప్రభుత్వాఫీసుల్లో ప్రజల నుంచి సర్టిఫికెట్లు తీసుకోవడం ఆపాలని, ప్రస్తుత రోజుల్లో అది ఆమోదయోగ్యం కాదని CM CBN అన్నారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా సర్టిఫికెట్లను డిజిటల్ వెరిఫికేషన్ చేయాలని అధికారులకు సూచించారు. విద్యార్థులు, ఉద్యోగార్థులు సర్టిఫికెట్లతో తిరిగే అవసరం ఉండకూడదని స్పష్టం చేశారు. సర్టిఫికెట్లు ఇచ్చేది ప్రభుత్వమే కావున వాటిని అన్ని శాఖలు చూడగలిగేలా సాఫ్ట్‌వేర్‌ను వాడుకోవాలన్నారు.

News March 12, 2026

జహీరాబాద్: భార్యను చంపిన భర్తకు జీవిత ఖైదు

image

భార్య హత్య కేసులో భర్తకు సంగారెడ్డి కోర్టు జీవిత ఖైదు విధిస్తూ బుధవారం తీర్పునిచ్చింది. 2012లో జహీరాబాద్‌కు చెందిన లక్ష్మీతో రాములకు పెళ్లైంది. మద్యానికి బానిసైన రాములు తరచుగా భార్యతో గొడవ పడేవాడు. దీంతో లక్ష్మి తల్లిగారి ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో 2021లో భార్య లక్ష్మిని రాములు స్మశాన వాటిక వద్దకు తీసుకువెళ్లి చున్నీతో హత్య చేశాడు. నేరం రుజువు కావడంతో నిందితుడికి కోర్టు శిక్ష విధించింది.