News March 10, 2025

సంగారెడ్డి: ఇంటర్ సెకండీయర్ హాజరు 98.11%

image

జిల్లాలో 54 పరీక్ష కేంద్రాల్లో సోమవారం జరిగిన ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పబ్లిక్ పరీక్షల్లో 16,084 మంది విద్యార్థులకు గాను 15,780 మంది విద్యార్థులు హాజరయ్యారని (98.11%) ఇంటర్మీడియట్ జిల్లా అధికారి గోవింద్ రాం తెలిపారు. 304 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.

Similar News

News March 11, 2025

అనర్హులని తేలితే ఏదశలో ఉన్నా ఇల్లు రద్దు చేస్తాం: మంత్రి పొంగులేటి

image

తెలంగాణ వ్యాప్తంగా ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ఎంపిక చేసి పనులు ప్రారంభించామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా పనులు ప్రారంభించామని.. లబ్ధిదారులు అనర్హులని తేలితే నిర్మాణం ఏ దశలో ఉన్నా ఎలాంటి ఆలోచన లేకుండా ఇల్లు రద్దు చేస్తామని తేల్చిచెప్పారు.

News March 11, 2025

బడిలో బాలిక మృతి.. ITDA PO వివరణ ఇదే

image

ఇచ్చోడ బాలికల ఆశ్రమ పాఠశాలలో బాలిక మృతపై ITDA PO కుష్బూ గుప్తా వివరణ ఇచ్చారు. బాలికకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవన్నారు. ఇటీవల వైద్య శిబిరంలోనూ ఆమెకు పరీక్షలు చేయగా ఎలాంటి సమస్యలు ఉన్నట్లు తేలలేదన్నారు. డాక్టర్ల ప్రాథమిక అభిప్రాయం ప్రకారం విద్యార్థిని శ్వాసకోస సంబంధిత సమస్యతో మృతి చెంది ఉండవచ్చని పేర్కొన్నారు. పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ వచ్చిన తరువాత పూర్తి వివరాలు తెలియజేస్తామని వెల్లడించారు.

News March 11, 2025

మార్చి 10: చరిత్రలో ఈ రోజు

image

*1689: ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మరణం
*1915: టీమిండియా మాజీ క్రికెటర్ విజయ్ హజారే జననం
*1922: తెలుగు సినిమా నేపథ్య గాయకుడు మాధవపెద్ది సత్యం జననం
*1955: పెన్సిలిన్ సృష్టికర్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్ మరణం
*1979: తెలుగు సాహితీకారుడు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ మరణం

error: Content is protected !!