News March 10, 2025

సంగారెడ్డి: ఇంటర్ సెకండీయర్ హాజరు 98.11%

image

జిల్లాలో 54 పరీక్ష కేంద్రాల్లో సోమవారం జరిగిన ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పబ్లిక్ పరీక్షల్లో 16,084 మంది విద్యార్థులకు గాను 15,780 మంది విద్యార్థులు హాజరయ్యారని (98.11%) ఇంటర్మీడియట్ జిల్లా అధికారి గోవింద్ రాం తెలిపారు. 304 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.

Similar News

News March 30, 2026

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా

image

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. మొత్తం 82 గంటల 47 నిమిషాల పాటు సాగిన ఈ సమావేశాల్లో 10 కీలక బిల్లులను సభ ఆమోదించింది. ఒక ముఖ్యమైన బిల్లును సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేయగా, రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ద్రవ్య వినిమయ బిల్లుకు కూడా ఆమోదం లభించింది. బడ్జెట్ అంశాలపై సుదీర్ఘ చర్చల అనంతరం స్పీకర్ సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

News March 30, 2026

ప.గో జిల్లా మత్స్యశాఖ అధికారిగా శ్రీనివాస్

image

జిల్లా మత్స్యశాఖ అధికారిగా డి.శ్రీనివాస్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన విజయవాడ నుంచి బదిలీపై జిల్లాకు వచ్చారు. కలెక్టర్ చదలవాడ నాగరాణిని ఆయన మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఆక్వా రైతులకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. అప్సర రిజిస్ట్రేషన్లు త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు.

News March 30, 2026

పెంచలకోనలో వైభవంగా వసంతోత్సవాల ప్రారంభం

image

పెంచలకోన క్షేత్రంలో వసంతోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం సాయంత్రం అనుజ్ఞ, విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం,రక్షాబంధనం,అంకురార్పణ హోమం వేద మంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా నిర్వహించారు. మార్చి 31 నుంచి ఏప్రిల్ 2 వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఈ మూడు రోజుల పాటు స్వామివారి నిత్య కళ్యాణం రద్దు చేయబడుతుంది. తిరిగి ఏప్రిల్ 3 నుంచి యథావిధిగా నిత్య కళ్యాణం నిర్వహించబడుతుందని అధికారులు తెలిపారు.