News March 10, 2025
భీమవరం: పీజీఆర్ఎస్కు 367 అర్జీలు

భీమవరం పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొని అర్జీలను స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. నేటి పీజీఆర్కు 367 అర్జీలు వచ్చాయని తెలిపారు. వాటిని సంబంధిత అధికారులు పంపించి త్వరగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News March 11, 2025
ప.గో: ఓపెన్ ఇంటర్ పరీక్షలకు 162 మంది గైర్హాజరు

పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా సోమవారం ఇంటర్మీడియట్ (APOSS) పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని విద్యాశాఖ అధికారి నారాయణ తెలిపారు. ఇవాళ జరిగిన ఫిజిక్స్ , పొలిటికల్ సైన్స్ పరీక్షలకు 11,77 మంది విద్యార్థులకు గాను 1,015 మంది హాజరు అయ్యారు అని తెలిపారు. 162 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు వెల్లడించారు. మొత్తంగా 86.24 % హాజరు నమోదయిందని తెలిపారు.
News March 11, 2025
12,13న రైతులకు కీలక సదస్సులు

ఈ నెల 12, 13న భీమవరంలో పూలసాగు, ఉద్యాన విలువ ఆధారిత ఉత్పత్తులపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నాగరాణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండు రోజులపాటు రైతులకు, ఉత్పత్తి దారులకు శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నామని తెలిపారు. 12న రక్షిత వ్యవసాయ పద్ధతులపై, 13న పంట కోత అనంతరం తీసుకోవలసిన జాగ్రత్తలపై శిక్షణ తరగతులు జరుగుతాయని తెలిపారు.
News March 10, 2025
P24 సర్వే శ్రద్ద పెట్టి చేయాలి: జిల్లా కలెక్టర్

ఆకివీడులో జరుగుతున్న P4 సర్వేను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో చదువుకున్న నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో P4 సర్వే నిర్వహిస్తున్నామన్నారు. సర్వే చేసేటప్పుడు శ్రద్ధ పెట్టి చేయాలని, ఎలాంటి తప్పులు ఉండకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా, వార్డు సచివాలయ అధికారి దాసిరెడ్డి పాల్గొన్నారు