News March 10, 2025
KNR జోన్ రీజనల్ మేనేజర్లతో జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సమీక్షా సమావేశం

KNR బస్ స్టేషన్ ఆవరణలోని సమావేశ మందిరంలో KNR జోన్ పరిధిలోని అన్ని రీజియన్లకు సంబంధించిన రీజనల్ మేనేజర్లు, డిప్యూటీ రీజనల్ మేనేజర్స్, KNR, WGL, NZB డిపో మేనేజర్లు, అధికారులతో KNR జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖుస్రో షా ఖాన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 2025 – 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్, ఇటీవల KNR, NZB, WGL లో ప్రవేశపెట్టిన ఎలక్ట్రికల్ బస్సుల పనితీరును సమీక్షించారు.
Similar News
News March 11, 2025
సంగారెడ్డి: ఇద్దరిని సస్పెండ్ చేసిన కలెక్టర్

ఆస్తి పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం వహించిన 17 మంది మున్సిపల్ సిబ్బందికి నోటీసులు, ఇద్దరిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ వల్లూరు క్రాంతి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న వారిలో జహీరాబాద్ ఆర్ఐ సంజీవ్, సదాశివపేట మేనేజర్ ఉపేందర్ సింగ్, సంగారెడ్డి కమిషనర్ ప్రసాద్ చౌహన్ ఉన్నారు. జహీరాబాద్ సదాశివపేట బిల్ కలెక్టర్లు అహ్మద్, శ్రీకాంత్లను సస్పెండ్ చేశారు.
News March 11, 2025
HYD: సైబర్ క్రైం.. రూ.36 లక్షలు ఇప్పించారు

హైదరాబాద్లో రిటైర్డ్ ఉద్యోగిపై డిజిటల్ అరెస్ట్ సైబర్ నేరగాళ్లు జరిపారు. ఫెడక్స్ కొరియర్ డ్రగ్స్ పేరుతో 43లక్షల రూపాయలు బ్యాంకు ద్వారా బదిలీ చేయించుకున్నారు. బాధితుడు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బాధితుడు డబ్బును ఫ్రీజ్ చేసి 36లక్షల రూపాయలను బాధితుడికి డీడీ ద్వారా సైబర్ క్రైమ్ డీసీపీ కవిత అందజేశారు.
News March 11, 2025
KMR: అనధికార లే అవుట్ల క్రమబద్దీకరణకు ఛాన్స్: కలెక్టర్

అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించిందని ఈ నెల 31వ తేదీలోగా చేసుకుంటే 25 శాతం రాయితీ ఇస్తుందని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని KMR జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ వెల్లడించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులు, లేఅవుట్ యజమానులతో సోమవారం కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ, వక్స్ బోర్డు, ఎండోమెంట్, శిఖం తదితర భూములకు ఈ అవకాశం వర్తించదని అన్నారు.