News March 10, 2025

కరీంనగర్: వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి: RTC JAC

image

కరీంనగర్‌లోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో ఆర్టీసీ జేఏసీ రీజియన్ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. కార్మికులంతా సమ్మెకు సమాయత్తం కావాలని, సమ్మెకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. వెంటనే ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన ఆర్టీసీ అంశాలను అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఈ.వెంకన్న తదితరులున్నారు.

Similar News

News March 19, 2026

పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టిన లోకేశ్: హోంమంత్రి అనిత

image

వివిధ ప్రభుత్వ శాఖలలో 10,060 పోస్టుల భర్తీకి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేశ్ శ్రీకారం చుట్టినట్లు హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఏటా ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రిని ‘X’ వేదికగా అభినందించారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు. నిరుద్యోగ యువత ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలన్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

News March 19, 2026

అనకాపల్లి: పండగకు వచ్చి మేనకోడలిపై అత్యాచారం..!

image

అనకాపల్లి మండలంలోని ఓ గ్రామంలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రావణి తెలిపారు. గురువారం తన కార్యాలయంలో కేసుకు సంబంధించిన వివరాలను తెలిపారు. పండగకు వచ్చిన వ్యక్తి వరసకు మేనకోడలైన బాలికను డాబాపైకి తీసుకువెళ్లి అత్యాచారం చేయడంతో పాటు బెదిరించాడు. బాలిక విషయాన్ని తల్లికి చెప్పడంతో ఆమె ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు.

News March 19, 2026

పార్టీల పంచాంగం.. అందరికీ శుభయోగమే!

image

TG: కాంగ్రెస్, BRS, BJP కార్యాలయాల్లో జరిగిన పంచాంగ శ్రవణంలో పండితులు భవిష్యత్ అంతా తమకే అనుకూలంగా ఉందని ప్రధాన పార్టీలకు వివరించారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, రేవంత్ పాలనకు ఇబ్బంది లేదని గాంధీభవన్లో తెలిపారు. ప్రజల్లో అసంతృప్తి పెరిగి విపక్షానికి బలం పెరుగుతుందని BRS ఆఫీస్‌లో చెప్పగా.. ఈ ఏడాదీ కలిసివచ్చి దేశం, రాష్ట్రంలో BJP హవా ఉంటుందన్నారు. కవితకు ప్రజల మద్దతు పెరుగుతుందని చెప్పారు.