News March 10, 2025
కరీంనగర్: వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి: RTC JAC

కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో ఆర్టీసీ జేఏసీ రీజియన్ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. కార్మికులంతా సమ్మెకు సమాయత్తం కావాలని, సమ్మెకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. వెంటనే ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన ఆర్టీసీ అంశాలను అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఈ.వెంకన్న తదితరులున్నారు.
Similar News
News November 4, 2025
నేటి నుంచి ఈ రాష్ట్రాల్లో ‘సర్’

నేటి నుంచి 9 రాష్ట్రాలు, 3 UTల్లో ఓటరు జాబితా సమగ్ర సవరణ(<<18119990>>SIR<<>>) ప్రక్రియ ప్రారంభం కానుంది. డిసెంబర్ 4 వరకు ఇది కొనసాగనుంది. DEC 9న డ్రాఫ్ట్ ఓటరు జాబితా, ఫిబ్రవరి 7న ఫైనల్ లిస్టును EC రిలీజ్ చేయనుంది. 51 కోట్ల మంది ఓటర్లు ఇందులో భాగం కానున్నారు. పారదర్శకంగా <<18121229>>సర్<<>> చేపడతామని ఈసీ పేర్కొనగా మరోవైపు ఈ ప్రక్రియను తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది.
News November 4, 2025
పశువుల్లో గొంతువాపు వ్యాధి లక్షణాలు – నివారణ

వర్షాకాలంలో ఇది ఎక్కువగా వస్తుంది. దీనినే గురకవ్యాధి అని కూడా అంటారు. కలుషితమైన నీరు, మేత వల్ల రోగనిరోధక శక్తి తగ్గితే ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి బారిన పడ్డ పశువు కంటి నుంచి నీరు, నోటి నుంచి చొంగకారుస్తుంటుంది. శ్వాస తీసుకునేటప్పుడు గురక శబ్దం వస్తుంది. తీవ్రమైన జ్వరం ఉంటుంది. గొంతు కిందకు నీరు చేరి గొంతువాపు వస్తుంది. ఈ లక్షణాలు పశువులో కనిపించిన వెంటనే వెటర్నరీ వైద్యుడిని సంప్రదించాలి.
News November 4, 2025
VJA: ఆన్లైన్ పెట్టుబడి మోసం.. ముగ్గురి అరెస్ట్

హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆన్లైన్ పెట్టుబడి మోసాల్లో ముగ్గురిని అరెస్ట్ చేశారు. గుంటూరుకు చెందిన మడతల రమేష్రెడ్డి, విశాఖకు చెందిన గండి శ్రీను, విజయవాడకు చెందిన గుర్రపుకొండ శ్రీధర్ బాధితుల బ్యాంకు ఖాతాల ద్వారా కోట్ల రూపాయలు లావాదేవీ చేసినట్లు వెల్లడైంది. వీరు వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో నకిలీ పెట్టుబడి పథకాలు నిర్వహించారు. పోలీసులు ఫోన్లు, డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకొన్నారు.


