News March 10, 2025

సిరిసిల్ల: సమర్థవంతంగా నిర్వహణ జరగాలి: మంత్రి

image

నీరు వృథా కాకుండా సమర్థవంతంగా సాగునీటి నిర్వహణ జరగాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో హైదరాబాదు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రజలకు వాస్తవ పరిస్థితులపై సమాచారం ఎప్పటికప్పుడు అందించాలని స్పష్టం చేశారు. హార్టికల్చర్, ఆయిల్ ఫామ్ వైపు రైతులను ప్రోత్సహించాలని సూచించారు.

Similar News

News January 6, 2026

డబ్బులివ్వకుంటే సిబ్బందికి జీతాలెలా: KRMB

image

AP, TG ప్రభుత్వాల తీరుపై కృష్ణానదీ యాజమాన్య బోర్డు (KRMB) అసంతృప్తి వ్యక్తం చేసింది. గత 3 త్రైమాసికాలుగా బోర్డుకు నిధులు విడుదల చేయకపోవడంపై ఆగ్రహించింది. FY25-26లో ఎలాంటి నిధులూ ఇవ్వకపోవడంపై 2 రాష్ట్రాల ఇరిగేషన్ ENCలకు లేఖ రాసింది. సిబ్బందికి జీతాలు చెల్లించడంలో ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొంది. కాగా టెలిమెట్రీ ఫేజ్2 కోసం TG అందించిన రూ.4.15CRను మళ్లించి సిబ్బందికి జీతాలు చెల్లిస్తున్నారు.

News January 6, 2026

ఓటర్ల జాబితాపై అభ్యంతరాలకు 8 వరకు గడువు: కలెక్టర్

image

పరకాల మున్సిపాలిటీ ఓటర్ల ముసాయిదా జాబితాపై ఏవైనా అభ్యంతరాలుంటే ఈ నెల 8లోగా సమర్పించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. తప్పులు లేని పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపొందించడమే యంత్రాంగం లక్ష్యమని స్పష్టం చేశారు. ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పుల ప్రక్రియకు రాజకీయ పార్టీలు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు.

News January 6, 2026

యాదాద్రి భువనగిరి కలెక్టర్.. గొప్ప మనసు

image

దత్త విద్యార్థి భరత్ చంద్ర కుటుంబానికి 200 గజాల ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేస్తూ ఇంటి పట్టాను కలెక్టర్ హనుమంతరావు మంగళవారం అందజేశారు. నారాయణపురం మండలం శేరిగూడెం గ్రామానికి చెందిన దత్త విద్యార్థి భరత్ చంద్ర చారి కుటుంబానికి మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులతో పాటు రూ.5000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గతంలో కలెక్టర్ ఇచ్చిన హామీ ప్రకారం.. 200 గజాల స్థలం పట్టాను అందజేశారు.