News March 11, 2025

12,13న రైతులకు కీలక సదస్సులు

image

ఈ నెల 12, 13న భీమవరంలో పూలసాగు, ఉద్యాన విలువ ఆధారిత ఉత్పత్తులపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నాగరాణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండు రోజులపాటు రైతులకు, ఉత్పత్తి దారులకు శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నామని తెలిపారు. 12న రక్షిత వ్యవసాయ పద్ధతులపై, 13న పంట కోత అనంతరం తీసుకోవలసిన జాగ్రత్తలపై శిక్షణ తరగతులు జరుగుతాయని తెలిపారు.

Similar News

News July 10, 2025

భీమవరంల: రాష్ట్ర స్థాయి సెస్ పోటీల బ్రోచర్‌ ఆవిష్కరణ

image

విద్యార్థులకు మేధాశక్తిని పెంపొందించే క్రీడ చెస్ అని మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. గురువారం భీమవరంలో ఈ పోటీల బ్రోచర్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం నిర్వహకులు మాదాసు కిషోర్ మాట్లాడారు. అనసూయ చెస్ అకాడమీ, వెస్ట్ గోదావరి చెస్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన గ్రంధి వెంకటేశ్వరరావు మెమోరియల్ ఇన్విటేషనల్ ఏ.పీ. స్టేట్ ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్‌ను జరుపుతున్నామన్నారు.

News July 10, 2025

641.544 కిలోల గంజాయి ధ్వంసం చేసిన: ఎస్పీ

image

పశ్చిమ గోదావరి జిల్లాలో స్వాధీనం చేసుకున్న 641.544 కిలోల గంజాయిని గుంటూరు జిల్లా కొండవీడులోని జిందాల్ అర్బన్ మేనేజ్‌మెంట్ ఈ-వేస్టేజ్ లిమిటెడ్‌లో అధికారులు ధ్వంసం చేశారు. 64 కేసులకు సంబంధించిన ఈ గంజాయిని బాయిలర్‌లో వేసి కాల్చివేసినట్లు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. ఈ ఆపరేషన్‌లో కృషి చేసిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

News July 10, 2025

అవార్డులు అందుకున్న ముగ్గురు జిల్లా అధికారులు

image

విజయవాడలో బుధవారం జరిగిన సభలో రెడ్‌క్రాస్ నిధుల సేకరణలో విశేష కృషి చేసిన ముగ్గురు జిల్లా అధికారులకు రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ మెడల్స్ అందించి, సత్కరించారు. జిల్లా వ్యవసాయ అధికారి జె.వెంకటేశ్వరరావు, డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఎం.వేణుగోపాల్, రిటైర్డ్ డీఈఓ వెంకటరమణలు ఈ మెడల్స్‌ను అందుకున్నారు. వీరు ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే రెడ్‌క్రాస్ సేవల కోసం రూ.5 లక్షలకు పైగా నిధులు సమకూర్చారు.