News March 11, 2025

హాజీపూర్ పీహెచ్‌సీ తనిఖీ చేసిన కలెక్టర్

image

వైద్యులు, సిబ్బంది విధుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం హాజీపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులను, మందుల నిల్వలను రిజిస్టర్లను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, సమయపాలన పాటిస్తూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

Similar News

News November 10, 2025

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

image

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ అనిల్ కుమార్‌తో కలిసి కలెక్టర్ ప్రజావాణిలో పాల్గొన్నారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సమస్యలు, వినతులు, పరిష్కారం నిమిత్తం 84 మంది దరఖాస్తు చేసుకున్న ప్రజల సమస్యలను విని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

News November 10, 2025

ఆర్థిక మోసానికి గురయ్యారా? ఇలా ఫిర్యాదు చేయండి

image

ఆర్థిక మోసాలకు గురైన బాధితులకు తక్షణ న్యాయం అందించేందుకు Sachet పోర్టల్‌ను RBI ప్రారంభించింది. అక్రమంగా డిపాజిట్లు సేకరిస్తున్న సంస్థలు/వ్యక్తుల గురించి ఫిర్యాదు చేయడానికి దీనిని రూపొందించారు. మీరు మోసపోయినట్లయితే <>sachet.rbi.org.in<<>> పోర్టల్‌లో సంస్థ పేరు, అడ్రస్, మోసం వివరాలు వంటి పూర్తి సమాచారాన్ని అందించి ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదును బట్టి పోలీసులకు లేదా దర్యాప్తు సంస్థలకు పంపుతారు.

News November 10, 2025

HYD: మెడికల్ అకాడమీని సందర్శించిన మాజీ మంత్రి

image

మాజీ మంత్రి జానారెడ్డి ఈరోజు అపోలో మెడికల్ అకాడమీని సందర్శించారు. విద్యార్థులను ప్రశంసిస్తూ మాట్లాడారు. ఈ చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో దేశానికి మెడికల్ విద్యార్థులు అందిస్తోన్న సేవలను, డైరెక్టర్ పోసిరెడ్డి శ్రీనివాసరెడ్డి కృషిని ప్రశంసించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని విద్యార్థులకు మంచి వెసులుబాటు కల్పించారని కొనియాడారు. విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచాలని సూచించారు.