News March 11, 2025
చేయిచేయి కలిపి వాననీటిని ఒడిసి పడదాం: కలెక్టర్

వాననీటి సంరక్షణతో భూగర్భ జలాలు పెరుగుతాయని, ఆహార భద్రతకు భరోసా కల్పించడంలో భూగర్భ జలాలది కీలకపాత్ర అని జిల్లాలో జల్ సంచయ్ జన్ భాగీదరి కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. సోమవారం కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన న్యూఢిల్లీ నుంచి వర్చువల్గా జల్ సంచయ్ జన్ భాగీదరిపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
Similar News
News July 10, 2025
HYD: స్వరూప మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలింపు

కల్తీకల్లు తాగి మృతి చెందిన స్వరూప మృతదేహాన్ని నిమ్స్ ఆసుపత్రి నుంచి స్వగ్రామానికి కుటుంబ సభ్యులు తరలిస్తుండగా అధికారులు అడ్డుకున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చరికి తరలించారు. దీంతో కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము దాహన సంస్కారాలకు అన్ని సిద్ధం చేసుకుంటే అధికారులు ఇలా చేయడం ఏమిటి అని ప్రశ్నించారు. పోస్టుమార్టం నిమిత్తమై తరలించినట్లు అధికారులు తెలిపారు.
News July 10, 2025
MNCL: సమగ్ర శిక్షా నూతన జెండర్ & డిప్యూటీ కోఆర్డినేటర్గా విజయలక్ష్మి

మంచిర్యాల జిల్లా సమగ్ర శిక్షా నూతన జెండర్ & డిప్యూటీ కోఆర్డినేటర్గా విజయలక్ష్మి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆమె దండేపల్లి మండలంలోని వెల్గనూర్ జడ్పీ ఉన్నత పాఠశాల గెజిటెడ్ హెచ్ఎంగా విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లాలో బాలికలకు భద్రత, భరోసాతో కూడిన నాణ్యమైన విద్య అందించి ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఈఓ యాదయ్య సూచించారు.
News July 10, 2025
400 రన్స్ చేసే అవకాశాలు మళ్లీ మళ్లీ రావు: గేల్

SA కెప్టెన్ ముల్డర్ ఇటీవల టెస్టులో 400రన్స్ చేసే అవకాశం ఉన్నా వద్దనుకోవడం చర్చనీయాంశమైంది. దీనిపై WI క్రికెట్ దిగ్గజం గేల్ స్పందించారు. ఇటువంటి అవకాశాలు మళ్లీ మళ్లీ రావన్నారు. ఛాన్స్ దొరికినప్పుడు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తనకు ఇటువంటి అవకాశమొస్తే వదలనని చెప్పారు. లారా(400*) రికార్డును అధిగమించే ఉద్దేశం లేకే 367* స్కోర్ వద్ద డిక్లేర్ చేసినట్లు ముల్డర్ వెల్లడించిన విషయం తెలిసిందే.