News March 11, 2025

చేయిచేయి క‌లిపి వాన‌నీటిని ఒడిసి ప‌డ‌దాం: కలెక్టర్

image

వాన‌నీటి సంర‌క్ష‌ణ‌తో భూగ‌ర్భ జ‌లాలు పెరుగుతాయ‌ని, ఆహార భ‌ద్ర‌త‌కు భ‌రోసా క‌ల్పించ‌డంలో భూగ‌ర్భ జ‌లాల‌ది కీల‌క‌పాత్ర అని జిల్లాలో జ‌ల్ సంచ‌య్ జ‌న్ భాగీద‌రి కార్య‌క్ర‌మాన్ని మ‌రింత ముందుకు తీసుకెళ్ళాలని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సూచించారు. సోమ‌వారం కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్ అధ్య‌క్ష‌త‌న న్యూఢిల్లీ నుంచి వ‌ర్చువ‌ల్‌గా జ‌ల్ సంచ‌య్ జ‌న్ భాగీద‌రిపై స‌మీక్షా సమావేశం నిర్వహించారు.

Similar News

News March 21, 2026

రాష్ట్రాలకు అదనంగా 20% కమర్షియల్ గ్యాస్

image

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో కేంద్రం శుభవార్త చెప్పింది. రాష్ట్రాలకు అదనంగా మరో 20% కమర్షియల్ గ్యాస్ అందించనున్నట్లు ప్రకటించింది. ఈనెల 23 నుంచి ఇది అమలులోకి రానుంది. ఇటీవల కేంద్రం అనౌన్స్ చేసిన 10% గ్యాస్‌కు ఇది అదనం. హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలకు గ్యాస్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు రాసిన లేఖలో కేంద్రం పేర్కొంది.

News March 21, 2026

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఐజీ

image

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయాన్ని మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి తనిఖీ చేశారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాలోని పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణలో తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ నాగేంద్ర చారి, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.

News March 21, 2026

ఇకపై ఖర్చులు పెరుగుతాయనేది నిజం: రాహుల్ గాంధీ

image

రూపాయి విలువలో క్షీణత, ఇండస్ట్రియల్ డీజిల్ ధరల హైక్ దేశంలో ద్రవ్యోల్బణానికి సంకేతాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. ఇది మామూలేనని కేంద్రం తోసిపుచ్చినా రవాణా ఖర్చులు పెరగడం, MSMEలపై భారం, నిత్యావసర సరకుల ధరల పెంపు, FII సెల్లింగ్‌తో స్టాక్ మార్కెట్లపై భారం పడనుందనేది నిజమన్నారు. ఎన్నికల తర్వాత ఇంధన ధరలు పెరుగుతాయని, దీనిని ఎదుర్కొనేందుకు మోదీ సర్కార్‌కు ప్లాన్ లేదని విమర్శించారు.