News March 11, 2025
కాకినాడ పర్యటనకు విచ్చేసిన మాజీ జస్టిస్ ఎన్.వీ రమణ

భారత సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వీ.రమణ కాకినాడ జిల్లా పర్యటన నిమిత్తం సోమవారం పట్టణానికి విచ్చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ షాన్ మోహన్, ఎస్పీ జీ.బిందు మాధవ్, జిల్లా నాల్గవ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ నిరుపమ పుష్పగుచ్ఛాలు అందించి ఆయనకు సాదర స్వాగతం పలికారు. మంగళవారం ఉదయం 9.గంటలకు ఆయన అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకుంటారని అధికారులు తెలిపారు.
Similar News
News March 16, 2026
‘స్వప్నం’ నెరవేర్చుకుంది.. 2 నెలల్లో 5 బ్యాంకు ఉద్యోగాలు

AP: బ్యాంకు ఉద్యోగం సాధించాలనే తన లక్ష్యానికి పెళ్లి అడ్డుకాదని నిరూపించారు విశాఖకు చెందిన స్వప్న. డిగ్రీ వరకు చదివిన ఈమె వివాహం తర్వాత శ్రీకాకుళం(D) జొన్నలపాడులో అత్తగారింట్లో పట్టుదలతో చదివారు. 2 నెలల వ్యవధిలోనే ఏకంగా 5 బ్యాంకు ఉద్యోగాలు సాధించారు. JAN 15న IBPS PO, FEB 23న RBO PO, FEB 27న SBI జూనియర్ అసోసియేట్, మార్చి 2న BOBలో క్లర్క్, మార్చి 15న APGBలో క్లర్కు ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
News March 16, 2026
హనుమకొండ : పరీక్ష రాసి ఇంటర్ విద్యార్థిని అదృశ్యం

హనుమకొండ హంటర్ రోడ్డులోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని అదృశ్యమైంది. సుబేదారి ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 13న షైన్ జూనియర్ కాలేజీలో చివరి పరీక్ష రాసి బయటకు వచ్చాక స్నేహితురాలితో కలిసి ఇంటికి వెళ్తానని చెప్పి రోడ్డు దాటింది. ఆ తర్వాత ఆమె కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందిన తండ్రి విజయ్ బహదూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News March 16, 2026
ఆయన త్యాగఫలమే ప్రత్యేక రాష్ట్రం

ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీక అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి నేడు. తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేశారు. ఈ త్యాగ ఫలితంగానే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పునాది పడింది. గాంధీజీకి శ్రీరాములు అంటే ఎంతో అభిమానం. అందుకే ‘శ్రీరాములు లాంటి వారు మరో పదిమంది ఉంటే ఏడాదిలోనే స్వరాజ్యం తెస్తాను’ అని గాంధీజీ చెప్పేవారు.


