News March 11, 2025

KMR: మంత్రుల వీడియో కాన్ఫరెన్స్ పాల్గొన్న జిల్లా కలెక్టర్

image

రబీ పంటలకు సాగు నీటి సరఫరాపై మంత్రులు ఉత్తమ్ కుమార్, తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్ శాంతి కుమారి జిల్లా కలెక్టర్‌లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ కాన్ఫరెన్స్‌లో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Similar News

News July 6, 2025

వర్షంలో తడుస్తున్నారా?

image

కొందరు వర్షంలో తడుసుకుంటూ ఇంటికి వచ్చి యథావిధిగా పనులు చేసుకుంటుంటారు. కానీ ఇలా చేయడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తడిసిన వెంటనే దుస్తులు మార్చుకుంటే శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి చేరుకుంటుంది. దీనివల్ల ఫంగస్ ఇన్ఫెక్షన్ కారకాల నుంచి తప్పించుకోవచ్చు. శరీరంపై యాంటీ బాక్టీరియల్ క్రీమ్ రాసుకోవాలి. టీ లేదా కషాయాలు తాగాలి. ఇలా చేస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.

News July 6, 2025

రాజీవ్ యువ వికాసానికి యువత ఎదురుచూపులు

image

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకంకై గద్వాల జిల్లాలోని నిరుద్యోగ యువత ఆశగా ఎదురుచూస్తున్నారు. దరఖాస్తులు సమర్పించి నెలలు గడుస్తున్నా.. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రాయితీ రుణాలతో స్వయం ఉపాధి పొందుదామనుకున్న యువత నిరాశకు గురవుతున్నారు. రాజీవ్ యువ వికాసం పథకంను ప్రభుత్వం త్వరగా అమలు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని వారు కోరుతున్నారు.

News July 6, 2025

NLG: ‘భూభారతి.. ఎలాంటి ఓటీపీలు అడగడం జరగదు’

image

భూ సమస్యల పరిష్కార విషయంలో ప్రభుత్వం రైతులను ఎలాంటి ఓటీపీ అడగడం జరగదని, అసలు ఓటీపీ సమస్యే రాదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. Way2News ఇవాళ ప్రచురితమైన వార్తకు కలెక్టర్ స్పందించారు. తహశీల్దార్ స్థాయిలోనే సమస్యలు పరిష్కారం అవుతాయని కలెక్టర్ వివరించారు. అందువల్ల రైతులు ఎవరు ఈ విషయాలను నమ్మవద్దని ఆమె స్పష్టం చేశారు.