News March 11, 2025

ఇల్లందు: సకల సదుపాయాలతో ప్రభుత్వాసుపత్రి భవన నిర్మాణం

image

ఇల్లందు పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో రూ.38 కోట్లతో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి, రూ.11 కోట్ల 50 లక్షలతో ప్రభుత్వ ఐటీఐ కాలేజీ నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. పట్టణంలో ఆయా భవన నిర్మాణాల కోసం సేకరించిన స్థలాలను భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వీ.పాటిల్‌తో ఎమ్మెల్యే కోరం కనకయ్య సోమవారం పరిశీలించారు. వారివెంట ఏరియా జీఎం వీ.కృష్ణయ్య, ఎమ్మార్వో రవికుమార్ ఉన్నారు.

Similar News

News March 11, 2025

విజయనగరం జిల్లాలో మైనార్టీలకు గుడ్ న్యూస్

image

ముస్లింలు, క్రైస్త‌వులు, బౌద్దులు, సిక్కులు, జైనులు, పార్శీకుల రుణాల‌ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని జిల్లా మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేష‌న్ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ ఆర్‌.ఎస్‌.జాన్ సోమవారం కోరారు. వివిధ బ్యాంకుల నుంచి సబ్సిడీతో కూడిన రుణాల‌ను అందించ‌నున్న‌ట్లు తెలిపారు. వ‌య‌సు 21- 55 లోపు ఉండాల‌న్నారు. తెల్ల రేష‌న్ కార్డు, ఆధార్ కార్డుతో ఆన్ లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

News March 11, 2025

ఖాద్రీశుడి సన్నిధిలో నారా లోకేశ్

image

కదిరిలో ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మంత్రి నారా లోకేశ్ నిన్న రాత్రి స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించాను. వేదపండితులు వసంత వల్లభుడికి ఆయనతో సంకల్పం చేయించారు. మంత్రి అనగాని సత్యప్రసాద్, కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్, హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, పల్లె రఘునాథరెడ్డి పాల్గొన్నారు.

News March 11, 2025

గుంటూరులో వ్యక్తి కిడ్నాప్

image

లాడ్జిలో వివాహితతో కలిసి ఉన్న ఓ వ్యక్తిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేసి అతణ్ని కిడ్నాప్ చేశారు. లాడ్జి మేనేజర్ తిరుపతి ఫిర్యాదు మేరకు లాలాపేట పోలీసులు కేసు నమోదు చేశామన్నారు. పోలీసుల కథనం.. జిన్నాటవర్ సెంటర్లోని బాలాజీ లాడ్జిలో రామలింగేశ్వరరావు అనే వ్యక్తి ఓ వివాహితతో రూమ్ తీసుకున్నాడు. నలుగురు వ్యక్తులు వచ్చి రామలింగేశ్వరరావుపై దాడి చేసి అతణ్ని తీసుకెళ్లారని తెలిపారు.

error: Content is protected !!