News March 11, 2025

ఇల్లందు: సకల సదుపాయాలతో ప్రభుత్వాసుపత్రి భవన నిర్మాణం

image

ఇల్లందు పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో రూ.38 కోట్లతో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి, రూ.11 కోట్ల 50 లక్షలతో ప్రభుత్వ ఐటీఐ కాలేజీ నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. పట్టణంలో ఆయా భవన నిర్మాణాల కోసం సేకరించిన స్థలాలను భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వీ.పాటిల్‌తో ఎమ్మెల్యే కోరం కనకయ్య సోమవారం పరిశీలించారు. వారివెంట ఏరియా జీఎం వీ.కృష్ణయ్య, ఎమ్మార్వో రవికుమార్ ఉన్నారు.

Similar News

News March 4, 2026

వారి హక్కుల కోసం పోరాడుతా: YS షర్మిల

image

విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో కాంగ్రెస్ పార్టీ నేతలు రంజాన్ సందర్భంగా మంగళవారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో PCC చీఫ్ YS షర్మిల పాల్గొన్నారు. సమాజంలో సామరస్యం పెంపొందించడమే ఇఫ్తార్ విందుల లక్ష్యమని ఆమె అన్నారు. ముస్లిం, మైనారిటీలకు YSR 4% రిజర్వేషన్లు అమలు చేశారన్నారు. వారి హక్కుల కోసం కాంగ్రెస్ తరఫున పోరాడుతానని షర్మిల వ్యాఖ్యానించారు.

News March 4, 2026

సౌదీపై దాడులు వద్దు.. ఇరాన్‌కు పాక్ వార్నింగ్!

image

గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తున్న ఇరాన్‌కు పాకిస్థాన్ వార్నింగ్ ఇచ్చింది. సౌదీ అరేబియాపై దాడులు చేయవద్దని చెప్పింది. సౌదీతో తమ రక్షణ ఒప్పందం గురించి గుర్తుచేసింది. తమకు వ్యతిరేకంగా సౌదీ భూభాగాన్ని ఉపయోగించకుండా చూడాలని ఇరాన్ తమకు చెప్పినట్లు పాక్ మంత్రి ఇషాక్‌ధర్ వెల్లడించారు. కాగా రెండు దేశాల్లో ఏ ఒక్కదానిపై దాడి జరిగినా రెండింటిపై జరిగినట్లుగా పరిగణించాలని సౌదీ-పాక్ <<17745790>>డీల్<<>> చేసుకున్న సంగతి తెలిసిందే.

News March 4, 2026

రూ.246కోట్ల ప్రమాద బీమా, లోన్ బీమా చెల్లింపు : సీతక్క

image

రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.246కోట్ల ప్రమాద బీమా, లోన్ బీమా మొత్తాన్ని చెల్లింపు చేసినట్లు మంత్రి సీతక్క తెలిపారు. మహిళా సంఘం సభ్యురాలు ప్రమాదంలో మరణిస్తే రూ.10లక్షలు, బ్యాంకులలో తీసుకున్న రుణాలలో గరిష్టంగా రూ.2లక్షల వరకు బీమా కవరేజీ ఇస్తున్నట్లు చెప్పారు. 2024నుంచి ఇప్పటి వరకు ప్రమాద బీమా కింద రూ.23.1కోట్లు, లోన్ బీమా కింద రూ.223.7కోట్లు చెల్లించిందని మంత్రి వెల్లడించారు.